మళ్లీ కెమెరా ముందుకు.. కొత్తగా ఉంది

తన చివరి చిత్రం ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’లో అందంతో పాటు అభినయాన్ని ప్రదర్శించి కుర్రకారును ఆకర్షించిన రాయ్‌లక్ష్మీ మళ్లీ కెమెరా ముందుకొచ్చింది....

Published : 18 Mar 2021 01:13 IST

రాయ్‌లక్ష్మీ

హైదరాబాద్‌: తన చివరి చిత్రం ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’లో అందంతో పాటు అభినయాన్ని ప్రదర్శించి కుర్రకారును ఆకర్షించిన రాయ్‌లక్ష్మీ మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. అందరికి గతేడాది కొవిడ్‌ వల్ల రోజులు భారంగా గడిస్తే, తనకు వీటితో పాటు తండ్రీ మరణం తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని వాపోయింది. తాజగా ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రంలో పవర్‌ఫుల్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

‘చాలాకాలం తర్వాత కెమెరా ముందుకు రావడం కొత్తగా అనిపిస్తోంది. నటిగా నా కెరీర్‌ తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఒక రివెంజ్‌ డ్రామా. మన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇందులో ప్రస్తావిస్తున్నాం. ముఖ్యంగా అత్యాచార బాధితులు, క్యాస్టింగ్‌ కౌచ్‌, అనేకచోట్ల మహిళలను వేధిస్తున్న సమస్యలపై న్యాయం కోసం పోరాడే పాత్ర నాది. అలాగే నా నిజ జీవితంలో గడిచిన ఏడాది ఒక పీడకల. నేను ఎంతో ప్రేమించే నాన్నగారు కాలం చేశారు. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగటం వల్ల నాకొక రకమైన ఒత్తిడి కలిగింది. నా ఫోన్‌.. ఆసుపత్రుల బిల్లులు, డాక్టర్స్‌ అపాయింట్‌మెంట్స్‌తో నిండిపోయింది. క్రమంగా పరిస్థితులు అర్థం చేసుకోవాటానికి ప్రయత్నిస్తున్నా. గడిచిన ఏడాది జరిగిన ఘటనలు.. మానసికంగా ఇంకెంత దృఢంగా ఉండాలనే విషయాన్ని నాకు బోధించాయి. ప్రస్తుతం మళ్లీ పనిలో బిజీ కావటం నాకు ఎంతో సంతోషానిస్తోంది ’అంటూ తన భావాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని