RGV: రాజకీయాల్లోకి నో ఎంట్రీ

ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే తనకు అస్సలు లేదని కాబట్టి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. సోషల్‌మీడియా....

Published : 13 May 2021 15:16 IST

సేవ చేసే ఉద్దేశం అస్సలు లేదు

హైదరాబాద్‌: ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే తనకు లేదన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కాబట్టి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన గతకొన్నిరోజుల నుంచి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు సంధిస్తూ వరుస పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రారంభం కానున్న స్పార్క్‌ ఓటీటీ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాలపై స్పందించారు.

రాజకీయ నాయకులపై ఎప్పటికప్పుడు పవర్‌ఫుల్‌ సెటైర్లు వేస్తున్న మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘నో. నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్‌ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే పొలిటిక్స్‌లోకి వస్తారు. అది నేను కాదు. సహజంగా ఏ నేత అయినా ఫేమ్‌, పవర్‌ కోసమే పొలిటిక్స్‌లోకి అడుగుపెడతాడు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ప్రజాసేవ అని పైకి చెబుతుంటాడు’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు.

అనంతరం స్పార్క్‌ ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాల గురించి స్పందిస్తూ.. ‘‘ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుంది. నాకు తెలిసిన ఓ వ్యక్తితో కలిసిన ఓటీటీని ప్రారంభిస్తున్నాం. మే 15న అది ప్రారంభం కానుంది. ఇందులో అన్నిరకాల కథాచిత్రాలు అందుబాటులో ఉంటాయి. దావూద్‌ ఇబ్రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ‘డీ కంపెనీ’ని సైతం దీనిలోనే విడుదల చేయనున్నాం. అతని జీవితాన్ని కొన్ని గంటల్లో సినిమాగా చూపించడం కొంతమేర కష్టమే అందుకే వెబ్‌సిరీస్‌గా తీసుకురానున్నాం. ఇప్పుడు విడుదల కానున్న ‘డీ కంపెనీ’ వెబ్‌సిరీస్‌ మొదటి పార్ట్‌గా భావించవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని