RGV: రాజకీయాల్లోకి నో ఎంట్రీ
ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే తనకు అస్సలు లేదని కాబట్టి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. సోషల్మీడియా....
సేవ చేసే ఉద్దేశం అస్సలు లేదు
హైదరాబాద్: ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే తనకు లేదన్నారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ. కాబట్టి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని తెలిపారు. సోషల్మీడియా వేదికగా ఎంతో యాక్టివ్గా ఉండే ఆయన గతకొన్నిరోజుల నుంచి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు సంధిస్తూ వరుస పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రారంభం కానున్న స్పార్క్ ఓటీటీ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాలపై స్పందించారు.
రాజకీయ నాయకులపై ఎప్పటికప్పుడు పవర్ఫుల్ సెటైర్లు వేస్తున్న మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘నో. నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే పొలిటిక్స్లోకి వస్తారు. అది నేను కాదు. సహజంగా ఏ నేత అయినా ఫేమ్, పవర్ కోసమే పొలిటిక్స్లోకి అడుగుపెడతాడు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ప్రజాసేవ అని పైకి చెబుతుంటాడు’’ అని రామ్గోపాల్ వర్మ అన్నారు.
అనంతరం స్పార్క్ ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాల గురించి స్పందిస్తూ.. ‘‘ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుంది. నాకు తెలిసిన ఓ వ్యక్తితో కలిసిన ఓటీటీని ప్రారంభిస్తున్నాం. మే 15న అది ప్రారంభం కానుంది. ఇందులో అన్నిరకాల కథాచిత్రాలు అందుబాటులో ఉంటాయి. దావూద్ ఇబ్రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ‘డీ కంపెనీ’ని సైతం దీనిలోనే విడుదల చేయనున్నాం. అతని జీవితాన్ని కొన్ని గంటల్లో సినిమాగా చూపించడం కొంతమేర కష్టమే అందుకే వెబ్సిరీస్గా తీసుకురానున్నాం. ఇప్పుడు విడుదల కానున్న ‘డీ కంపెనీ’ వెబ్సిరీస్ మొదటి పార్ట్గా భావించవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత