ఆకట్టుకునేలా ‘ఐఐటీ కృష్ణమూర్తి’ పాట

యువ నటీనటులు పృధ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న కథా చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ వర్ధన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే, ‘ఐఐటీ కృష్ణమూర్తి’....

Updated : 25 Mar 2023 17:17 IST

హైదరాబాద్‌: యువ నటీనటులు పృధ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న కథా చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ వర్ధన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే, ‘ఐఐటీ కృష్ణమూర్తి’ చిత్రాన్ని డిసెంబర్‌ 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మేఘంతో మేఘం మురిసే’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని