సుధీర్‌ సలహా.. ఆగిపోయిన పెళ్లి

ప్రతి ఆదివారం రెట్టింపు వినోదం పంచుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది.

Published : 05 Jul 2021 00:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఆదివారం రెట్టింపు వినోదం పంచుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. హైపర్‌ ఆది, ఆటో రాంప్రసాద్‌ పెళ్లి పెద్దలుగా ఉండి బుల్లితెర జంట ఇమ్మాన్యుయెల్‌, వర్షను ఒక్కటి చేశారు.  అయితే.. ఇదంతా జరిగింది ఇమ్మాన్యుయెల్‌ ఊహలో.. ఎందుకంటే.. పెళ్లికి 20మందిని మాత్రమే పిలవాలనే నిబంధన ఉండగా.. 40 మందిని పిలవమని సుధీర్‌ ఇచ్చిన సలహాతో ఇమ్మూ పెళ్లి ఆగిపోయింది పాపం. దీంతో ఇమ్మాన్యుయెల్‌ కోపం తట్టుకోలేక ‘ఓరెయ్‌ సుధీర్‌ ఇటురారా’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. మొత్తం స్కిట్‌ చూడాలంటే ఈ దిగువన ఉన్న వీడియోను చూసేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని