K Viswanath: సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ సంయోగ సమభూశితే...
కె.విశ్వనాథ్ (K Viswanath) సినిమా అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది సంగీతం, సాహిత్యం, నాట్యం. ఆయన సినిమాల్లోని పాటలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. సంస్కృతంలో సాగే పాటలైనా సరే ఆ శ్రావ్యత ప్రేక్షకుల్ని కవ్విస్తూనే ఉంటుంది.
* కె.విశ్వనాథ్ (K Viswanath) సినిమా అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది సంగీతం, సాహిత్యం, నాట్యం. ఆయన సినిమాల్లోని పాటలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. సంస్కృతంలో సాగే పాటలైనా సరే ఆ శ్రావ్యత ప్రేక్షకుల్ని కవ్విస్తూనే ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’తోనే సీతారామశాస్త్రి గీత రచయితగా పరిచయం అయ్యారు. ఇందులోని ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...’ ఆయనకి తొలి గీతం. ఈ సినిమా పేరే ఆయనకి ఇంటి పేరయ్యింది. మరో ప్రముఖ రచయిత వేటూరి సుందరరామమూర్తి రచనా జీవితం కూడా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’తోనే ఊపందుకుంది. ఆ చిత్రం కోసం ఆయనతో మూడు పాటలు రాయించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కలయిక ప్రభంజనం సృష్టించింది.
సాహసాలు.. ప్రయోగాలు
సాహసాలకి పెట్టింది పేరు కె.విశ్వనాథ్. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నెన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. అందగాడుగా పేరున్న శోభన్బాబుని ‘చెల్లెలి కాపురం’ సినిమాలో డీ గ్లామరైజ్ చేసి చూపించడం... ఆరుపదుల వయసున్న సోమయాజులుని తన ‘శంకరాభరణం’లో కథానాయకుడిగా చూపించడం...మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవిని ‘స్వయంకృషి’తో చెప్పులు కుట్టే వ్యక్తిగా చూపించడం... అంధుడైన కథానాయకుడు, మాటలు రాని కథానాయిక నేపథ్యంలో ‘సిరివెన్నెల’ తీయడం... ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు.
దైవానుగ్రహమే ఎక్కువ..
తన విజయాల్లో దైవానుగ్రహమే ఎక్కువనేవారు దర్శకుడు కె.విశ్వనాథ్. దానికి తన స్వయం కృషి కాస్త తోడైందని చెప్పేవారాయన. ‘‘నా ఉద్దేశంలో 20శాతం నా కష్టం.. మిగిలిన 80శాతం దేవుడి కృప. ఎందుకంటే నా విజయాల్లో నా కష్టమే ఎక్కువనుకుంటే అది పొరపాటు. నా చదువేమిటో నాకు తెలుసు. నేనేమీ రామాయణం, భారతం, భాగవతం చదవలేదు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని కథలు తయారు చేయలేదు. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి? ఇలాంటి కథలు ఎంచుకోవాలి? అనే ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినట్లు! విద్య అయినా ఉండాలి, లేదంటే ఎక్స్పోజరైనా అయి ఉండాలి. నాకు ఇవేం లేవు. కాబట్టి ఇదంతా దైవానుగ్రహం కాకపోతే ఇంకేమైనట్లు’’ అని తన విజయసూత్రాన్ని వివరించేవారు కళాతపస్వి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’