Ponniyin Selvan: త్రిష కోసం 50 లుక్స్‌.. నందినిగా రేఖ

చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఈ చిత్రాన్ని రూపొందించారు....

Published : 22 Sep 2022 01:49 IST

చెన్నై: చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్‌, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఈ సినిమాలో యువరాణి కుందవై పాత్రలో త్రిష నటించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె లుక్‌ని మణిరత్నం అంత ఈజీగా ఓకే చేయలేదు. ‘‘కుందవై యువరాణి లుక్స్‌ కొన్నింటినీ మీరు ఇప్పటికే ట్రైలర్‌లో చూశారు. ఈ లుక్స్‌ని ఫైనల్‌ చేయడం అంత సాధారణంగా జరగలేదు. ఇందుకోసం సుమారు 50 లుక్స్‌ ప్రయత్నించాం. దానిలో 30 ఫైనల్‌ చేసి.. వాటిల్లోనుంచి ఉత్తమమైన పదింటిని తీసుకున్నాం. ఆ పదిలో సినిమాకు ఏది నప్పుతుందో మణిరత్నం ఓకే  చేశారు’’ అని త్రిష చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కీలకంగా చెప్పుకొనే రాణి నందినిగా బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ నటించినప్పటికీ.. మొదట ఆ పాత్రకు నటి రేఖను అనుకున్నట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని