RRR: మే 20 నుంచి ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. కానీ, ఆ మెలిక పెట్టారా..?

రూ.1000 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించిన రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.....

Published : 04 May 2022 14:55 IST

హైదరాబాద్‌: రూ.1000 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించిన రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌చరణ్‌, తారక్‌ల నటనకు సినీ ప్రియులందరూ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ జీ5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 20 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి. ఇక, జూన్‌ 3 నుంచి ఆయా స్ట్రీమింగ్‌ ప్లాట్‌పామ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని