‘పీకే’కు సీక్వెల్.. హీరోగా రణ్బీర్కపూర్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖాన్ హీరోగా 2014లో వచ్చిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. థియేటర్కు వచ్చిన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రూ.85కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.850కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది. రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కించారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ హీరోగా 2014లో వచ్చిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రూ.85కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.850కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది. రాజ్కుమార్ హిరాణి ‘పీకే’ను తెరకెక్కించారు. ఆ చిత్రంతో అనుష్కశర్మ, సుశాంత్సింగ్, బొమన్ ఇరానీ, సౌరవ్ శుక్లా, సంజయ్దత్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే.. ఆ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
‘పీకే’లో అతిథి పాత్ర పోషించిన యువనటుడు రణ్బీర్కపూర్ రాబోయే సీక్వెల్లో ప్రధానపాత్ర పోషించనున్నాడట. ఈ వార్త బాలీవుడ్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘పీకే’ నిర్మాత వినోద్ చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా.. రణ్బీర్కపూర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమాలో కింగ్ నాగార్జున నటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్