Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ ఈ ఆసక్తికర విషయాలు మీకోసం..
Sarkaru Vaari Paata: మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారువారి పాట’ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..
ఇంటర్నెట్డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్2’,‘ఆచార్య’ తర్వాత మరో పెద్ద చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది. మహేశ్బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారిపాట’(Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం...
* మహేశ్బాబు వెండితెరపై కనిపించి రెండున్నరేళ్లు దాటిపోయింది. 2020 సంక్రాంతి సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఆయన ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్తో ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) ఆలస్యమవుతూ వచ్చింది.
* 2020 మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
* మహేశ్బాబు-పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది.
* తొలుత ఈ సినిమాలో కథానాయికగా కియారా అడ్వాణీ, సయీ మంజ్రేకర్ల పేర్లు వినిపించాయి. కానీ, చివరకు కీర్తిసురేశ్ను ఓకే చేశారు. మహేశ్తో కీర్తికి ఇది తొలి చిత్రం.
* ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా? అన్నదానిపై చిత్ర బృందం తీవ్రంగా చర్చించింది. ఒకానొక సందర్భంగా కన్నడ నటుడు ఉపేంద్ర పేరు కూడా వినిపించింది. కానీ, రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత సముద్రఖని ఓకే అయ్యారు.
* తమన్-మహేశ్బాబు కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రం ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata). గతంలో ‘దూకుడు’, బిజినెస్మెన్, ‘ఆగడు’ చిత్రాలకు పనిచేశారు. ఇక పరశురామ్తో కలిసి ‘ఆంజనేయుడు’, శ్రీరస్తు-శుభమస్తు చిత్రాలకు తమన్ స్వరాలు సమకూర్చారు.
* కరోనా కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్ర బృందం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత మహేశ్బాబు మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడింది. అంతా బాగుందనే సమయానికి మహేశ్ కరోనా బారిన పడ్డారు. ఇలా ఎన్నో అడ్డంకులు ఈ చిత్రానికి ఎదురయ్యాయి.
* తొలుత ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల చేయాలని నిర్ణయించారు. షూటింగ్ ఆలస్యమవడంతో ఏప్రిల్ 1న 2022న విడుదల చేస్తామన్నారు. చివరకు మే 12న ‘సర్కారువారి పాట’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
* మహేశ్బాబు తనయ సితార ఇందులో ఓ పాటకు డ్యాన్స్ చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
* కీర్తిసురేశ్ కీలక పాత్రల్లో ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘సర్కారువారి పాట’ మూడో చిత్రం.
* మహేశ్ కెరీర్లో మొత్తం నాలుగు చిత్రాలు మే నెలలో విడుదలయ్యాయి. నిజం, నాని, బ్రహ్మోత్సం, మహర్షి. ఇప్పుడు ఈ సినిమాలో ఐదోది.
* గతంలో మహేశ్ నటించిన ఐదు సినిమాలు గురువారం (బాబీ, సైనికుడు, అతిథి, ఖలేజా, మహర్షి) విడుదల కాగా, ఇప్పుడు ఈసినిమా ఆరోది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!