first day first show: ‘ఖుషి’ మూవీ ఫస్ట్ షో టికెట్ల కోసం సాహసమే ఈ మూవీ!
ప్రతిష్ఠాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో` (First Day First Show). మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కె.వి(Anudeep KV) కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు..
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మరో జాతిరత్నాలు మూవీలా అలరిస్తుందని దర్శకులు వంశీ, లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాంత్రెడ్డి, సంచిత కీలక పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇరువురు దర్శకులు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ ఎలా ఉంటుంది ?
వంశీ: ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవన్ కళ్యాణ్ అభిమాని. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. చాలా రోజులు ఆ అమ్మాయి వెంటపడితే తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్లను సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో లక్ష్యం.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా?
వంశీ: ‘ఖుషి’ సమయంలో నేను ఫస్ట్ క్లాస్. నా అనుభవంలో లేవు కానీ, అనుదీప్ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పారు. టికెట్ల కోసం ఎంతదూరం వెళ్లారో చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా, ఫన్నీగా అనిపించింది.
‘ఖుషి’ అంటే 2001..ఈ సినిమా కోసం అప్పటి వాతావరణాన్ని సృష్టించారా?
వంశీ: చాలా అంశాలు రిక్రియేట్ చేశాం. విడుదలైన టీజర్లో మీరు గమనిస్తే అప్పటి బాక్సులు కనిపిస్తాయి. దానితో పాటు చాలా వరకు అప్పటి వాతావరణాన్ని రీక్రియేట్ చేశాం.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మరో జాతిరత్నాలు అనుకోవచ్చా?
వంశీ: ఫస్ట్ డే ఫస్ట్ షో డిఫరెంట్ మూవీ. అయితే, జాతిరత్నాలు సినిమా వాతావరణం ఉంటుంది.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టిక్కెట్ల విషయంలో మీకు అనుభవాలేమైనా ఉన్నాయా?
లక్ష్మీనారాయణ: తిరుపతిలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికేవి. రాత్రి మూడు గంటలకు షో ఉండేది. అలా ‘పంజా’ చూశా. చాలా మంది జనం ఉండేవారు. అప్పుడప్పుడు తొక్కిసలాట జరిగేది. అందుకే ఈ కథకి చాల కనెక్ట్ అయ్యా.
వంశీ: నా జనరేషన్ కి వచ్చేసరికి టికెట్లు సులువుగానే దొరికేవి. ఒక్కడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా.
తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది?
లక్ష్మీనారాయణ: సీనియర్స్తో పని చేయడం చాలా మంచి అనుభవం. వారితో పని చేయడానికి కాస్త భయపడ్డాం. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులకు మనం ఏం చెప్పగలం.. అనిపించేది. అయితే వాళ్ళు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. సన్నివేశాలు అద్భుతంగా తీయగలిగాము. మాతో పని చేయడాన్ని వాళ్ళు అలాగే ఎంజాయ్ చేశారు.
ఈ సినిమాకి సంగీతం దర్శకుడిగా రథన్ ఎంపిక వెనుక కారణం?
వంశీ: రథన్ చాలా ప్రతిభ వున్న కంపోజర్. తెలుగు భాష తెలియనప్పటికీ ఆయనకి సంగీతంపై మంచి పట్టు ఉంది. పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు.
పూర్ణోదయలో సినిమా చేయడం ఎలా అనిపించింది?
వంశీ:పూర్ణోదయ అంటేనే క్లాసిక్. సినిమాని ప్రేమించే నిర్మాతలు. శ్రీజ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొదటి సినిమా చేస్తున్న నిర్మాతలా అనిపించలేదు. అనుకున్నట్లుగా సినిమాని చాలా వేగంగా పూర్తిచేశాము. షెడ్యుల్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేయడం వారికి బాగా నచ్చింది.
ఇంత మీ నేపథ్యం గురించి చెప్పలేదు!
లక్ష్మీనారాయణ: మాది తిరుపతి దగ్గర చంద్రగిరి. పదేళ్ళ నుండి హైదరాబాద్ లోనే ఉన్నా. జాతిరత్నాలు సినిమాకి రైటింగ్ విభాగంలో పని చేశా. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ అనుదీప్ గారిది. ఈ కథకు ఇద్దరు దర్శకులు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అలా వంశీ, నేను ప్రాజెక్ట్ చేశాం.
వంశీ: నేను డాక్టర్ చదివా. డాక్టర్ ని అయ్యాను కూడా. అయితే సినిమాలు అంటే ఇష్టం. ‘జాతిరత్నాలు’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేశా. అనుదీప్ గారితో సినిమాల పరంగా మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ ఆలోచనని ఆయన చెప్పడం, చాలా వేగంగా కథను తెరకెక్కించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?