Valimai: ‘వలిమై’ రాకకు ముహూర్తం ఫిక్స్‌?

అజిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వలిమై’. బోనీ కపూర్‌ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల

Updated : 02 Feb 2022 07:02 IST

జిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వలిమై’. బోనీ కపూర్‌ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కొవిడ్‌ పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని  ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలో దీనిపై అధికారిక  ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా సందడి చేయనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనే విడుదల చేసే యోచనలో చిత్రబృందముంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని