Aadhi Pinishetty: పెళ్లి పీటలెక్కనున్న ఆది పినిశెట్టి.. ఆ నటితోనేనా..?

‘గుండెల్లో గోదారి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’ ‘నీవెవరో’, ‘యూ టర్న్‌’, ‘గుడ్‌ లక్‌ సఖి’ వంటి...

Updated : 21 Nov 2022 15:18 IST

చెన్నై: ‘గుండెల్లో గోదారి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’ ‘నీవెవరో’, ‘యూ టర్న్‌’, ‘గుడ్‌ లక్‌ సఖి’ వంటి చిత్రాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఆయన పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నట్లు సమాచారం.

2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ (Yagavarayinum Naa Kaakka) కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్‌లో ఉన్నారని.. గతంలో వార్తలు వచ్చాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం ఆది-నిక్కీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పారనీ.. త్వరలోనే నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని