Nagarjuna: రీమేక్‌ కథతో నాగార్జున?

ఇటీవలే ‘ది ఘోస్ట్‌’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు నాగార్జున. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు.

Updated : 25 Nov 2022 07:01 IST

టీవలే ‘ది ఘోస్ట్‌’తో (The Ghost) ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు నాగార్జున (Nagarjuna). అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. తన తనయుడు అఖిల్‌తో కలిసి మోహన్‌ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం వినిపించినా.. ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఇప్పుడాయన ఓ రీమేక్‌ కథకు పచ్చజెండా ఊపారని సమాచారం. మలయాళంలో విజయవంతమైన ‘పొరింజు మరియం జోస్‌’ (porinju mariyam jose) చిత్రాన్ని నాగ్‌ తెలుగులో రీమేక్‌ చేయనున్నారని, దీన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారని తెలిసింది. ఈ సినిమాతో రచయత ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకుడిగా పరిచయం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు