NTR: ఎన్టీఆర్ కోసం సైఫ్?.. ఈ నెలలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశాలు
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) 30వ చిత్రం పక్కా పాన్ ఇండియా హంగులతో రూపొందుతోంది. నటుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) 30వ చిత్రం పక్కా పాన్ ఇండియా హంగులతో రూపొందుతోంది. నటుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ప్రతినాయకుడిగానూ బాలీవుడ్ నటుడే కనిపిస్తారని కొంతకాలంగా వినిపించింది. ఆ పాత్ర చేయడానికి బాలీవుడ్కి చెందిన ప్రముఖ కథానాయకుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పచ్చజెండా ఊపారని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు. తదుపరి చేయనున్న చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా ఎన్టీఆర్ - కొరటాల శివ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆ మేరకు కథ, కథనాలతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తుండగా, కల్యాణ్రామ్ సమర్పిస్తున్నారు.
‘నాటు నాటు’ గూగుల్ సెర్చ్ రికార్డులు..: విడుదలైన దగ్గరి నుంచి తగ్గేదేలే అంటూ క్రేజ్ సొంతం చేసుకున్న ‘నాటు నాటు’ (Naatu Naatu) ఏకంగా ఆస్కార్ను గెలుచుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుతో ఈ పాట రేంజ్ అమాంతం పెరిగింది అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా ‘నాటు నాటు’తో మారుమోగిపోతుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు దీని కోసం తెగ వెతికేసినట్లు తాజా అధ్యాయనంలో వెల్లడైంది. ఆస్కార్ ప్రకటించాక ఈ పాటను 10 రెట్లు అధికంగా వెతికినట్లు జపాన్కు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 1,105 శాతం సెర్చ్తో ‘నాటు నాటు’ రికార్డు సృష్టించిందని తెలిపింది.
ఆ క్షణాల్ని మరిచిపోలేను
ఆస్కార్ (Oscars 2023) వేదికపై నాటు నాటు పాటకిగానూ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ పురస్కారాల్ని స్వీకరించిన క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు ఎన్టీఆర్ (NTR). 95వ ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్కి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించింది. అదొక అద్భుతమైన అనుభవం. భారతీయుడిని...అందులోనూ తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నా. మేం ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే కారణం అభిమానులు, సినీ ప్రేమికులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైంది. ఆస్కార్ పురస్కారం వచ్చిన వెంటనే మొదటగా నా భార్యకి ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకున్నా’’ అన్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నృత్య దర్శకుడు ప్రేమ్రక్షిత్ (Prem Rakshith) మాట్లాడుతూ ‘‘ఆస్కార్ వేడుకల్లో వేదికపై పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్నవాళ్లందరూ లేచి నిలుచొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం కన్నీళ్లు వచ్చాయి. అవార్డు తీసుకన్న తర్వాత కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేన’’న్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?