Kiara Advani: కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ విడిపోయారా..?

‘షేర్షా’తో బాలీవుడ్‌ సినీ ప్రియుల మదిదోచిన రీల్‌ కపుల్‌ సిద్ధార్థ్‌ మల్హోత్ర, కియారా అడ్వాణీ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ‘షేర్హా’....

Published : 23 Apr 2022 12:55 IST

స్టార్‌కపుల్‌ బ్రేకప్‌ అంటోన్న బీటౌన్‌

ముంబయి: ‘షేర్షా’తో బాలీవుడ్‌ సినీ ప్రియుల మదిదోచిన రీల్‌ కపుల్‌ సిద్ధార్థ్‌ మల్హోత్ర, కియారా అడ్వాణీ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ‘షేర్హా’ షూట్‌ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అందరూ చెప్పుకొన్నారు. తరచూ వీరు డిన్నర్‌ డేట్స్‌, హాలీడే కోసం విదేశాలకు వెళ్లి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో మీ పెళ్లి ఎప్పుడంటూ.. సోషల్‌మీడియాలో అభిమానులు అడుగుతున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ తమ బంధానికి బ్రేకప్‌ చెప్పుకొన్నారని, అందుకే ఎక్కడా కలిసి కనబడటం లేదని, ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారని బీటౌన్‌ కోడైకూస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు దర్శనమిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని