రాకేశ్‌ పెద్ద పెద్ద వాళ్లనే పంపించేశాడు: రోజా  

హైదరాబాద్‌: నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.

Updated : 18 Nov 2020 09:19 IST

హైదరాబాద్‌: నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.

హైపర్‌ ఆది స్కిట్‌లో భాగంగా ‘జబర్దస్త్‌’ స్టేజ్‌పై సుధీర్‌ అండ్‌ టీమ్‌ సందడి చేయనున్నారు. ‘ఇంద్ర’ స్ఫూప్‌తో ఆది-సుధీర్‌ వేసిన వరుస పంచులతోపాటు స్నేహలతా రెడ్డిగా శాంతిస్వరూప్‌ ఆకట్టుకోనున్నారు. అదిరే అభి స్కిట్‌లో భాగంగా రాకేశ్‌ స్టేజ్‌పై వరుస పంచులతో నవ్వించనున్నారు. రాముకి రాకేశ్‌ పంచులు వేస్తున్న తరుణంలో.. రోజా అందుకుని.. ‘రాకేశ్‌... పెద్దపెద్ద వాళ్లనే పంపించేశాడు’ అని సరదాగా అన్నారు. చలాకీ చంటి, వెంకీ మంకీస్‌ స్కిటులు సైతం ఆకట్టుకోనున్నాయి. వచ్చే గురువారం (నవంబర్‌ 19) ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి..!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని