Rakul singh: ‘రన్‌వే 34’ పై ప్రియుడి రివ్యూకి రకుల్‌ ఫిదా...

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘రన్‌వే 34’. బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 27 Apr 2022 20:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘రన్‌వే 34’. బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2015లో జరిగిన ఓ యదార్థఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాపై రకుల్‌ ప్రియుడు జాకీ భగ్నానీ ట్విట్‌ చేశాడు. సినిమా చూశానని అందరూ అద్భుతంగా నటించారంటూ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘రన్‌వే 34 సాంకేతికంగా ఉన్నతమైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆజయ్‌దేవగణ్‌ సార్‌ మీ దర్శకత్వం అద్భుతం. అమితాబచ్చన్‌ సార్‌ మీరు మీ నటనతో సినిమాకు అదనపు వెలుగులు నింపారు. రకుల్‌ నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు  కచ్చితంగా ఆదరిస్తారు.’ అంటూ చిత్ర బృందాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విట్‌ చేశారు. దీనిపై రకుల్‌ స్పందిస్తూ రెండు హర్ట్‌ ఎమోజీలను పోస్ట్‌ చేసి జాకీ ట్విట్‌ను రీట్విట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని