jacqueline fernandez: ఓదార్పు అవసరం
తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంకకు ఆ దేశ మోడల్, బాలీవుడ్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన మద్దతును తెలుపుతూ ఇన్స్టాలో ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం లంక ప్రజలకు కావాల్సింది
తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంకకు ఆ దేశ మోడల్, బాలీవుడ్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన మద్దతును తెలుపుతూ ఇన్స్టాలో ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం లంక ప్రజలకు కావాల్సింది తీర్పులు కాదని కాస్త ఓదార్పు అవసరమని పేర్కొంది. తన దేశ ప్రజలకు సాంత్వన కలిగేలా పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. అనవసర వ్యాఖ్యానాలు చేసే బదులు 2 నిమిషాల పాటు చేసే ప్రార్థన వారు కష్టాలను ఎదుర్కొనేందుకు సాయపడుతుందని శ్రీలంక జెండాను ఉంచుతూ చేసిన పోస్టులో జాక్వెలిన్ అభిప్రాయపడింది. ఇటీవలే ‘అటాక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాక్వెలిన్ త్వరలోనే కిచ్చా సుదీప్తో కలసి ‘విక్రాంత్ రోణ’లో సందడి చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం