Jacqueline Fernandez: దయచేసి ఆ ఫొటోలు షేర్‌ చేయొద్దు: జాక్వెలిన్‌

మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్‌ చంద్రశేఖర్‌, నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు...

Published : 09 Jan 2022 14:10 IST

సుఖేశ్‌తో పర్సనల్‌ ఫొటోలు వైరల్‌.. స్పందించిన నటి

ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన కొన్ని పర్సనల్‌ ఫొటోలు వైరల్‌గా మారాయి. తాజాగా ఆ ఫొటోలపై జాక్వెలిన్‌ స్పందించారు. ప్రస్తుతం తాను జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘ఈ దేశ ప్రజలు నాపై ప్రేమాభిమానాలు చూపించారు. దానిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా మీడియా మిత్రుల నుంచి జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో మీడియా, అభిమానులు అండగా ఉన్నారు. ఆ నమ్మకంతోనే మీ అందరికీ ఓ చిన్న విన్నపం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయవద్దని కోరుతున్నా. మీ ప్రియమైన వారి పర్సనల్‌ ఫొటోలు ఎలా అయితే షేర్‌ చేయరో నా ఫొటోలు కూడా అందరితో పంచుకోరని భావిస్తున్నా. అలాగే, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని జాక్వెలిన్‌ పేర్కొన్నారు.

రూ.200 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు విచారిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ప్రధాన నిందితుడిగా సుఖేశ్‌ చంద్రశేఖర్‌ పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్‌ నటీమణులు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతేహి పేర్లను కూడా చేర్చింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని