Puri Jagannath: ‘జన గణ మన’ టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు మారిందా..!
పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్టు ‘జన గణ మన’ చిత్రం బాలీవుడ్ నటీనటులతో తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం బాలీవుడ్లోని ఇద్దరు అగ్రహీరోలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్టు ‘జనగణమన’. ఈ సినిమాను పూరీ 2018లోనే ప్రకటించారు. మొదట ఈ చిత్రంలో మహేశ్బాబు కథానాయకుడిగా నటించనున్నారంటూ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఏమీ బయటకు రాలేదు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ తన కలల ప్రాజెక్టులో నటిస్తున్నారని..పాన్ ఇండియా స్థాయిలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దీంతో పూరీ జగన్నాథ్ మళ్లీ ఈ సినిమాను పక్కనపెట్టారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ‘జనగణమన’ కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను పూరీజగన్నాథ్ బాలీవుడ్ నటీనటులతో తీయాలని చర్చలు జరుపుతున్నారట. రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్ను సంప్రదించినట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరు ఒప్పుకుంటే ఈ సినిమా పట్టాలెక్కుతుందని పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి