janhvi kapoor: అమ్మ చేత్తో నాకోసం రాసిందే... నాచేతిపై టాటూ

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తన తల్లి, ప్రముఖ హీరోయిన్‌, అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్టు చేశారు. 2018లో శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమించే జాన్వీ ఆమె జ్ఞాపకార్థం... అమ్మ చేత్తో తన కోసం రాసిన మాటల్నే.. చేతిపై టాటూగా వేయించుకున్నారు.

Updated : 07 Oct 2021 17:49 IST

తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకున్న జాన్వీకపూర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తన తల్లి, ప్రముఖ హీరోయిన్‌,  శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్టు చేశారు. 2018లో శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమించే జాన్వీ ఆమె జ్ఞాపకార్థం... అమ్మ చేత్తో తన కోసం రాసిన మాటల్నే.. చేతిపై టాటూగా వేయించుకున్నారు. శ్రీదేవి జాన్వీని ముద్దుగా లబ్బూ అని పిలుస్తారట.  ‘‘ ఐ లవ్‌ యూ మై లబ్బూ,. యూ ఆర్‌ ది బెస్ట్‌ బేబీ ఇన్‌ ది వరల్డ్‌’’ అని శ్రీదేవి ఓ పేపర్‌ మీద రాసిచ్చిన వ్యాక్యాల్లో ‘‘ ఐ లవ్‌ యూ లబ్బూ’’ పదాలను చేతిపై ఎప్పటికీ చెదరకుండా ఉండేలా పర్మనెంట్‌ టాటూ వేయించారు. ఈ సందర్భంగా ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వాటితో పాటు ఇటీవలే ఆమె సందర్శించిన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల ఫొటోలను జతచేశారు. 

అందుకే ఆ చీర అంటే స్పెషల్‌..

చిన్నప్పుడు శ్రీదేవి ధరించిన చీర అంటే జాన్వీకి ఎంతో ఇష్టమట.  ‘మామ్‌’లో శ్రీదేవి నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటికే ఆమె కన్నుమూయడంతో తన తల్లి తరఫున జాన్వీ కపూర్‌ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమానికి శ్రీదేవి చీరను ధరించి అవార్డు అందుకోవడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని