Janhvi Kapoor: మా అమ్మ టీనేజ్‌లోనే పెద్దవారితో కలిసి నటించింది..: జాన్వీ కపూర్‌

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానుతో తన సినిమా విశేషాలు పంచుకుంటుంది హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి(Sridevi) గురించి మాట్లాడింది. 

Published : 30 Dec 2022 12:45 IST

హైదరాబాద్‌: అలనాటి అందాలతార  శ్రీదేవి(Sridevi) కుమార్తెగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది ఈ అమ్మడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఇక నటన గుర్తించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తన తల్లిని గుర్తుచేసుకునే ఈ భామ తాజాగా మరోసారి శ్రీదేవి గురించి మాట్లాడింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ ‘‘మా అమ్మకు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఏ హీరోతో అయితే నటించిందో.. 21 ఏళ్లకు ఆ హీరో కుమారుడితోనూ నటించింది. నటనలో ఇలాంటివి సహజం. కళకు వయసుతో సంబంధం లేదు. వయసులో తనకంటే ఎంతో  పెద్దవారైన గొప్పహీరోలు కూడా ఆమె సరసన నటించడానికి ఇష్టపడేవాళ్లు’’ అని చెప్పింది.

ఇక తాజాగా ‘మిలీ’ (Mili) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ.. ఈ సినిమా కోసం చాలానే కష్టపడింది. అందుకే బాక్సాఫీసు వద్ద చిత్రం విజయం సాధించనప్పటికీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు జాన్వీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎవరి సరసన నటించనుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. RC16లో రామ్‌చరణ్‌తో కలిసి ఆడిపాడనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని