పంజాబ్‌కు జాన్వీ

బాలీవుడ్‌ యువ కథానాయిక జాన్వీకపూర్‌ గత ఏడాది ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విజయం సాధించిన ‘కొలమావు కోకిల’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అందులో జాన్వీ కపూర్‌ నాయికగా నటించనున్న

Published : 06 Jan 2021 12:22 IST

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయిక జాన్వీకపూర్‌ గత ఏడాది ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విజయం సాధించిన ‘కొలమావు కోకిల’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. వీటిలో జాన్వీ కపూర్‌ నాయికగా నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి సెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో 45 రోజుల పాటు జరగనుంది. సిద్ధార్థ్‌ సేన్‌ గుప్తా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు తగినట్లు పలు మార్పులు చేయనున్నారట. జాన్వీ నటించిన ‘రూహీ ఆఫ్జానా’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ‘దోస్తానా 2’ సెట్స్‌పై ఉంది. త్వరలోనే మరికొన్ని చిత్రాల సంగతులు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి!

అలాంటి అనుమతులు ఇక్కడా ఇవ్వండి

‘మీరు డాక్టర్‌ను కలిస్తే మంచిది’ 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని