కలలను నిజం చేశారు: నవీన్‌ పొలిశెట్టి

కలలను నిజం చేసేవాళ్లే తెలుగు ప్రేక్షకులు అని ‘జాతిరత్నాలు’ హీరో నవీన్‌ పొలిశెట్టి అన్నారు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలు పోషించారు. ఫారియా అబ్దుల్లా

Published : 18 Mar 2021 23:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కలలను నిజం చేసేవాళ్లే తెలుగు ప్రేక్షకులు అని ‘జాతిరత్నాలు’ హీరో నవీన్‌ పొలిశెట్టి అన్నారు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలు పోషించారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌. మార్చి 11న శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలు ఈ సమయంలో ఎంతో అవసరం. మీ స్పందన చూస్తుంటే ఒక కలలా ఉంది. తెలుగు ప్రేక్షకులు మా కలలను నిజం చేశారు. మా సినిమాలో కనిపించే జాతి రత్నాలు నేను, దర్శి, రాహుల్‌ రామకృష్ణ కానీ.. కనిపించని జాతిరత్నాలు నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక, స్వప్న. నాగీ ఈ సినిమా కోసం మహానటి కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. డైరెక్టర్‌ అనుదీప్‌ గురించి చెప్పాలంటే.. నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక డైరెక్టర్‌ను కలిశానని అనుకున్నాను. కానీ.. ఇప్పుడు ఒక బ్రదర్‌ దొరికాడు’ అని నవీన్ అన్నారు. ప్రియదర్శి, రాహులు రామకృష్ణ మాట్లాడుతూ.. సినిమాను ఇంతలా ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని