ఏప్రిల్‌ 11న ఓటీటీలోకి ‘జాతిరత్నాలు’

పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో విడుదలైందీ చిత్రం. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు డిజిటల్‌ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

Published : 07 Apr 2021 21:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో విడుదలైందీ చిత్రం. హౌస్‌ఫుల్‌ బోర్డులతో బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు డిజిటల్‌ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఏప్రిల్‌ 11 నుంచి ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలు పోషించారు. అనుదీప్‌ దర్శకత్వంలో తెరెకెక్కించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా సందడి చేసింది. మురళీశర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, నరేశ్‌ కీలక పాత్రలు పోషించారు. రధన్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని