Jeevitha Rajasekhar: తప్పు చేస్తే నడిరోడ్డుపై నిల్చోబెట్టి కొట్టాలి: సినీనటి జీవితా రాజశేఖర్
సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు. నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఫిలిం ఛాంబర్ సభ్యులు హైదరాబాద్ ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సినీ నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా జీవిత మాట్లాడుతూ అసత్య కథనాలపై మండిపడ్డారు. తనకీ ఓ కుటుంబం ఉంటుందని.. ఇలాంటి వార్తలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?
‘‘ఇండస్ట్రీ ముఖ్యంగా మీడియా వాళ్లు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా షూటింగ్స్, ఇతర పనులు ఇలా మా కుటుంబం మొత్తం మా పనుల్లోనే ఎప్పుడూ బిజీగా ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటాను. ఇలా ఉన్నప్పటికీ మా కుటుంబం గురించి వచ్చినన్ని అసత్య వార్తలు మరెవరి మీద రాలేదు. నేను ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?.
ఆ కేసు కోర్టులో నడుస్తోంది.. నిజానిజాలు వస్తాయి
ఇటీవల ‘గరుడవేగ’ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ మాపై ఎన్నో ఆరోపణలు చేశారు. సినిమాకి వాళ్లు కొంత మొత్తమే ఖర్చుపెట్టారు. మిగతాది మేము ఆస్తులమ్ముకుని మరీ డబ్బు తీసుకువచ్చి సినిమా కోసం ఖర్చు పెట్టాం. కానీ, రిలీజ్ అయ్యాక.. సినిమాకి వచ్చిన డబ్బు మొత్తం వాళ్లే తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్లు ఇటీవల మీడియా ముందుకు వచ్చి ‘జీవిత రాజశేఖర్ రూ.26 కోట్లు మాకు ఎగ్గొట్టారు. మోసం చేశారు’ అని ఆరోపణలు చేశారు. ఆ వార్తలను మీడియా నాలుగు రోజులుపాటు ప్రసారం చేసింది. దానిపై నేను ఆయా మీడియా వాళ్లని అడగాను. ‘కోటేశ్వరరాజు, హేమ మాకు బ్లాంక్ చెక్ చూపించారు’ అని చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయి.
అలాంటి వార్తలతో 25 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నా..
అంతేకాకుండా ఇటీవల నా కుమార్తెలపై ఏవేవో వార్తలు రాశారు. నా కుమార్తె వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా కొంతమంది థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తలు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని మీడియా హౌస్లు మాత్రమే ఇలా చేస్తున్నాయి. దయచేసి, మా కష్టాలను అర్థం చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేశామో లేదో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. మేము తప్పు చేశామని రుజువైతే నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి కొట్టండి. ఇలాంటి అసత్య వార్తల వల్ల గత 25 ఏళ్ల నుంచి నేను ఎంతో ఇబ్బందిపడుతున్నా. లీగల్ పోరాటం చేయొచ్చు కానీ, అంత సమయం, డబ్బు అందరి దగ్గరా ఉండదు. మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.
ఆ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు
ఇటీవల ‘శేఖర్’ ప్రమోషన్స్లో భాగంగా నా కుమార్తెలతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నేను ఓ నానుడి వాడితే.. దాన్ని వేరేలా అర్థం చేసుకుని ఆర్యవైశ్య వర్గం వారిని కించపరిచినట్లు వార్తలు వచ్చాయి. దానిపై చర్చా సమావేశం కూడా చేశారు. ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా మాటలతో ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించండి’’ అని జీవిత అన్నారు.
పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యం: ఆదిశేషగిరిరావు
అనంతరం ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఓటీటీ వచ్చాక వంద సమస్యలు మొదలయ్యాయని.. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రమే యూట్యూబ్లో పైరసీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలింఛాంబర్ యాంటీ పైరసీ విభాగం ఇతరుల చేతుల్లో ఉందని.. డబ్బున్నవాళ్లకే యాంటీ పైరసీ సెల్ పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యం. నిర్మాత మండలికి కట్టుబాట్లు లేకుండా పోయాయి. నిర్మాతల మండలిలో చేసే తీర్మానాలు వేరు.. బయట జరిగేవి వేరు. నిర్మాతల మండలి కొంతమంది చేతుల్లోకి వెళ్లింది. ఓటీటీపై కూడా కేంద్రం సెన్సార్స్ ఉండాలి. కేన్స్ చలన చిత్రోత్సవానికి హైదరాబాద్ నుంచి ఒక్కరూ వెళ్లలేదు’’ అని ఆదిశేషగిరిరావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)