13 ఏళ్ల తర్వాత

మలయాళంలో మంచి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘అయ్యప్పన్‌ కోషియమ్‌’. పలుభాషల్లోకి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కుల్ని ప్రముఖ కథానాయకుడు జాన్‌ అబ్రహం సొంతం...

Published : 06 Feb 2021 12:28 IST

ముంబయి: మలయాళంలో మంచి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘అయ్యప్పన్‌ కోషియమ్‌’. పలుభాషల్లోకి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కుల్ని ప్రముఖ కథానాయకుడు జాన్‌ అబ్రహం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాతృకలో పృథ్వీరాజ్, బిజు మీనన్‌ పోషించిన పాత్రల్ని హిందీలో ఎవరు చేస్తారనే విషయంలో ఆసక్తి ఉండేది. తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. జాన్‌ అబ్రహం, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో ఈ హిందీ రీమేక్‌ పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి కలయికలో 13 ఏళ్ల క్రితం వచ్చిన ‘దోస్తానా’ మంచి విజయం సాధించింది.

ఇదీ చదవండి

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని