
John Abraham: నేను రూ.299 నటుడ్ని కాదు.. బిగ్ స్క్రీన్ స్టార్ని: జాన్ అబ్రహం
ఓటీటీ ఎంట్రీపై బాలీవుడ్ నటుడు వైరల్ కామెంట్స్
ముంబయి: వెండితెరపై స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన, వెలుగుతున్న తారలు ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కథ నచ్చితే వెబ్సిరీస్ల్లో నటించేందుకూ పచ్చజెండా ఊపుతున్నారు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) ఓటీటీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రూ.299 నటుణ్ని కాదని, బిగ్ స్క్రీన్ స్టార్ని అన్నాడు. ఇటీవల ‘ఎటాక్’ (Attack)తో పరాజయాన్ని అందుకున్న జాన్ త్వరలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’ (EK Villain Returns)తో రాబోతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో జాన్ అబ్రహం ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కెరీర్ ఎలా ప్రారంభమైంది? చేస్తున్న సినిమాలు? తదితర అంశాలపై మాట్లాడాడు. ఈ క్రమంలో విలేకరి.. ‘‘బాలీవుడ్లో చాలామంది ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు వస్తారు?’’ అని అడిగారు. దానికి జాన్ స్పందిస్తూ ‘‘నేను బిగ్ స్క్రీన్ హీరోని. వెండితెరపైనే నా సినిమాలు ఆడాలనుకుంటాను. అక్కడే నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతానికి నేను వెండితెర కోసమే సినిమాలు చేయాలనుకుంటున్నా. రూ.299, రూ.499కి అందరికీ అందుబాటులో ఉండటం నాకిష్టం లేదు’’ అని అన్నాడు. దీంతో ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, దక్షిణాది సినిమాల్లో నటించడంపై గతంలో జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బాలీవుడ్ ఎప్పటికీ నంబర్ వన్ అని, తాను బాలీవుడ్ హీరోనని, ఇతర చిత్రపరిశ్రమల సినిమాల్లో నటించడం ఇష్టం లేదని అప్పుడు కామెంట్స్ చేశాడు జాన్. ఇప్పుడు ఓటీటీ మీద ఇలాంటి కామెంట్లు చేశాడు. సినిమాల విషంయలో జాన్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అని బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
-
India News
Corona: 2.5 శాతానికి దిగొచ్చిన రోజువారీ పాజిటివిటీ రేటు
-
World News
Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
-
Movies News
upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Business News
stock Market: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
-
Related-stories News
Mukesh Ambani: ముకేశ్ అంబానీ కుటుంబానికి భద్రతపై సవాల్.. సుప్రీంకోర్టులో విచారణ నేడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Viveka Murder Case: శివశంకర్రెడ్డిదే కీలక పాత్ర
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- ‘అమ్మఒడి’ ల్యాప్టాప్లకు మంగళం
- సన్నిహితులకే ‘కిక్కు!’