
John Abraham: నేను రూ.299 నటుడ్ని కాదు.. బిగ్ స్క్రీన్ స్టార్ని: జాన్ అబ్రహం
ఓటీటీ ఎంట్రీపై బాలీవుడ్ నటుడు వైరల్ కామెంట్స్
ముంబయి: వెండితెరపై స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన, వెలుగుతున్న తారలు ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కథ నచ్చితే వెబ్సిరీస్ల్లో నటించేందుకూ పచ్చజెండా ఊపుతున్నారు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) ఓటీటీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రూ.299 నటుణ్ని కాదని, బిగ్ స్క్రీన్ స్టార్ని అన్నాడు. ఇటీవల ‘ఎటాక్’ (Attack)తో పరాజయాన్ని అందుకున్న జాన్ త్వరలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’ (EK Villain Returns)తో రాబోతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో జాన్ అబ్రహం ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కెరీర్ ఎలా ప్రారంభమైంది? చేస్తున్న సినిమాలు? తదితర అంశాలపై మాట్లాడాడు. ఈ క్రమంలో విలేకరి.. ‘‘బాలీవుడ్లో చాలామంది ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు వస్తారు?’’ అని అడిగారు. దానికి జాన్ స్పందిస్తూ ‘‘నేను బిగ్ స్క్రీన్ హీరోని. వెండితెరపైనే నా సినిమాలు ఆడాలనుకుంటాను. అక్కడే నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతానికి నేను వెండితెర కోసమే సినిమాలు చేయాలనుకుంటున్నా. రూ.299, రూ.499కి అందరికీ అందుబాటులో ఉండటం నాకిష్టం లేదు’’ అని అన్నాడు. దీంతో ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, దక్షిణాది సినిమాల్లో నటించడంపై గతంలో జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బాలీవుడ్ ఎప్పటికీ నంబర్ వన్ అని, తాను బాలీవుడ్ హీరోనని, ఇతర చిత్రపరిశ్రమల సినిమాల్లో నటించడం ఇష్టం లేదని అప్పుడు కామెంట్స్ చేశాడు జాన్. ఇప్పుడు ఓటీటీ మీద ఇలాంటి కామెంట్లు చేశాడు. సినిమాల విషంయలో జాన్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అని బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Dasoju Sravan: డ్రగ్స్కు ఖైరతాబాద్ అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్
-
World News
Power Crisis: పాకిస్థాన్లో కరెంటు సంక్షోభం తీవ్రం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్..?
-
Sports News
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్
-
Business News
GDP growth estimates: భారత జీడీపీ వృద్ధి అంచనాల్లో క్రిసిల్ కోత
-
India News
Maharashtra: మెట్రో కార్షెడ్పైనే శిందే తొలి నిర్ణయం.. మాజీ బాస్ నిర్ణయం పక్కకు..!
-
Technology News
OnePlus Nord 2T 5G: వన్ ప్లస్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ఆ తేదీల్లో కొనుగోళ్లపై ఆఫర్స్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి