John abraham: నా కెరీర్ ముగిసిందని రాసిన వారే నన్ను వెతుక్కుంటూ వచ్చారు
బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సినీ విమర్శకులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ‘అభిషేక్ బచ్చన్లాగా మీరూ ఏదైనా విమర్శను సీరియస్గా తీసుకున్న సందర్భాలున్నాయా?’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా షాకింగ్ రిప్లై ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సినీ విమర్శకులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ‘అభిషేక్ బచ్చన్లాగా మీరూ ఏదైనా విమర్శను సీరియస్గా తీసుకున్న సందర్భాలున్నాయా?’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘‘నేనసలు నాపై రాసే విమర్శలను పట్టించుకోను. ఒకప్పుడు నా సినిమాలు చూసి ఇక జాన్ కెరీర్ ముగిసిపోయిందని రాసేవారు. ఆ తరవాత ఏదో ఒక సందర్భంలో వారంతా నా సాయం పొందినవారే. అలా వచ్చినప్పుడు చాలా కారణాలు చెప్పేవారు. ‘మాకు మీ గురించి తెలియదు. ఆ రోజు ఏదో సమస్యల్లో ఉండి అలా రాసేశాం. క్షమించండి..’ అని కోరేవారు. నేను అర్థం చేసుకోగలను. వారూ మనుషులే. కొందరికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు. లేదా ఉదయాన్నే లేచిన మూడ్ సరిగా లేకపోవచ్చు. అలా విమర్శించిన వారిలో దాదాపు ఓ 20 మందిదాకా నన్ను వెతుక్కుంటూ వచ్చినవారే. కొందరు రచయితగా పని అడిగేవారు. పేర్లు చెప్పను కానీ, అందులో చాలా మందికి నేను చేయగలిగింది చేశాను. సాయం అందుకున్న వారిలో కొందరు మారారు. ఇంకా కొందరు మాత్రం ఇతరుల కెరీర్లు ముగిశాయంటూ రాస్తూనే ఉన్నారు’’ అంటూ వివరించాడు. జాన్ అబ్రహాం నటించిన ‘అటాక్’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అర్జున్ కపూర్తో కలిసి నటిస్తున్న ‘ఏక్ విలన్’ సీక్వెల్ను ఈ ఏడాది జులై 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.