John Abraham: జాన్‌ అబ్రహాం గాయాలు చూసి ఆశ్యర్యపోయిన అమితాబ్‌!

జాన్‌ అబ్రహాం కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సత్యమేవ జయతే2’. యాక్షన్‌

Published : 28 Nov 2021 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జాన్‌ అబ్రహాం కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సత్యమేవ జయతే2’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, తాజాగా జాన్‌ అబ్రహాం, దివ్య కోస్లా కుమార్‌లు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతికి వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తాను స్కూల్‌ గర్ల్‌గా ఉన్నప్పటి నుంచి ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ చూస్తున్నా అని దివ్య అనగా, తన వయసును గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటూ అమితాబ్‌ ఆమెను సరదాగా ఆటపట్టించారు.

ఇక బిగ్‌బిని చూడటం ఎంతో సంతోషంగా ఉందని జాన్‌ అబ్రహాం ఆనందం వ్యక్తం చేశారు. అమితాబ్‌ ఎంతో పాజిటివ్‌గా ఉంటారని, ఆయనొక జాతీయ సంపద అని అభివర్ణించారు. ఈ సందర్భంగా యువకుడిగా ఉన్నప్పుడు బాక్సింగ్‌ చేస్తుండగా తనకు అయిన గాయాన్ని షోలో చూపించారు. బాక్సింగ్‌ చేస్తుండగా ఛాతీ భాగంలో తీవ్రగాయమైందని అన్నారు. ఆ గాయాల మచ్చలను చూసిన అమితాబ్‌ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తనకు బైక్స్‌ అంటే ఎంతో ఇష్టమని వివిధ మోడల్‌ బైక్స్‌ 18 వరకూ ఉన్నాయని జాన్‌ చెప్పాడు. ఈ ఎపిసోడ్‌లో జాన్‌, దియాలు రూ.25లక్షలు గెలుచుకున్నారు. జంతు ప్రేమికుడైన జాన్‌ అబ్రహాం ఆ మొత్తాన్ని జంతు సంరక్షణ ట్రస్ట్‌కు ఇచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు