NTR: ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌

స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Updated : 10 May 2021 15:26 IST

హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌తో సాధారణ ప్రజలే కాదు.. సినీ తారలు సైతం వైరస్‌ బారినపడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘తాజాగా చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా’’ -ట్విటర్‌లో ఎన్టీఆర్‌

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’లో కొమరం భీమ్‌గా నటిస్తున్నారు ఎన్టీఆర్‌. రామ్‌చరణ్ మరో కథానాయకుడు. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించనున్నారు.

మరోవైపు సినీ నటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.  ఇటీవల పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, కంగనా రనౌత్‌, శిల్పాశెట్టి కుటుంబం సహా పలువురు తారలు తాము కరోనా బారినపడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్‌ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని