Jubilee: రేసులో గెలిచేది నిశ్శబ్దంగా ఉన్నవాళ్లే

భారతీయ చిత్ర పరిశ్రమలోని తెరవెనుక కథల నేపథ్యంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌ ‘జూబ్లీ’ (Jubilee). విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కిస్తున్నారు.

Updated : 25 Mar 2023 07:15 IST

భారతీయ చిత్ర పరిశ్రమలోని తెరవెనుక కథల నేపథ్యంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌ ‘జూబ్లీ’ (Jubliee). విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో అదితిరావ్‌ హైదరి, అపరశక్తి ఖురాన్‌, ప్రొసెన్‌జిత్‌ ఛటర్జీ, వామిక గబ్బి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేము ఇక్కడ చేస్తున్న వినోదాత్మక వ్యాపారంలో అందరు మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ, నిశ్శబ్దంగా ఉన్నవాళ్లే ఈ రేసులో గెలుస్తారు’ అని అదితి చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఇది పాత సినిమాలలోని వేషధారణతో, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1947లో ముంబయిలో బాలీవుడ్‌ ప్రారంభ దశను, చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకోవడానికి కొందరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఇందులో చూపించనున్నారు. ఈ సిరీస్‌ మొదటి భాగం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని