అందుకే.. ఆ పాట ఈ రోజు
28..44..4.. ఏమిటీ నంబర్లు...? దర్శకుడు కే.రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ కొలతలా..! అనుకుంటున్నారా? కాదు కాదు.. ఆయన జీవితంలో ముఖ్యమైన నెంబర్లివి. ఇంద్రధనస్సుకు చీరకట్టి...
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
28..44..4..
ఏమిటీ నంబర్లు...? దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ కొలతలా..! అనుకుంటున్నారా? కాదు కాదు.. ఆయన జీవితంలో ముఖ్యమైన నెంబర్లివి. ఇంద్రధనస్సుకు చీరకట్టి... మల్లెలు తురిమి అలంకరిస్తే.. ఆయన సినిమాల్లో కథానాయికలా మెరిసిపోతుంది. చంద్రుడికి ప్యాంటు షర్ట్ వేసి, మాస్ లుక్ని అద్దితే ఆయన చిత్రంలో కథానాయకుడై మన మనసు దోచేస్తాడు. సెలయేళ్లు దర్శకేంద్రుడి పాటల్లో నాట్యమాడతాయి. పూలు, పండ్లు తామెందుకు పుట్టామో అనే విషయాన్ని ఆయన గీతాల్లోనే తెలుసుకుంటాయి. ‘అవన్నీ తెలుసండీ... ఇంతకీ పై నంబర్లేంటి?’ అంటారా? ఇదే విషయాలను ‘ఈనాడు సినిమా’ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే అడిగింది. 78 ఏళ్ల వయసులో ‘28’ఏళ్ల యువకుడిలా ఆలోచించే ఆయన దాంతో పాటు తన కొత్త సినిమా ‘పెళ్లిసంద..D’ విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
వాటి ప్రాధాన్యమిది
‘‘ఏప్రిల్ 28న నందమూరి తారక రామారావు నటించిన ‘అడవిరాముడు’ సినిమా విడుదలైంది. అది ఎంతటి బ్లాక్బస్టర్ అయిందో మీకు తెలుసు. తెలుగులో మొట్టమొదటగా కోటి రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రమది. అందుకే నా జీవితంలో అతి ముఖ్యమైన సినిమా ‘అడవిరాముడు’. అలాగే నా సమర్పణలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ అదే తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ సినిమా తెలుగు సినీ పరిశ్రమవైపు చూసి ఆశ్చర్యపోయాలా చేసింది. అందుకే ఈ నెల 28 నాకు అంత ప్రత్యేకం. ‘అడవిరాముడు’ విడుదలై 44 ఏళ్లవుతోంది. ‘బాహుబలి 2’ వచ్చి 4ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా నా ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘పెళ్లిసంద...D’ చిత్రం పాటను విడుదల చేస్తున్నా.’’
వాళ్లే కారణం
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల నాయకానాయికలుగా తెరకెక్కుతున్న ‘పెళ్లి సంద..D’ నేను తీయడానికి కారణం రాజమౌళి, కీరవాణి, సత్యానంద్లే. శ్రీకాంత్ హీరోగా తీసిన ‘పెళ్లిసందడి’ ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఆ సినిమా విడుదల తర్వాత పెళ్లి వాహనాలకు, మండపాలకు... పలానా వారి పెళ్లి సందడి అని రాయడం మొదలు పెట్టారు. ఒక దర్శకుడిగా, కథకుడిగా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ సినిమాకు కొనసాగింపు చిత్రం మీరు తీస్తే చూడాలని ఉందని దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత సత్యానంద్ అడిగారు. అప్పటి నుంచి నాలో ఆలోచన మొదలైంది.
రక్తి-భక్తి... రాఘవేంద్రరావు-కీరవాణి
‘పెళ్లిసంద...D’ అని పేరు ఎందుకు పెట్టాం? ఆంగ్ల అక్షరం D కి ఉన్న అర్థమేంటి? అనేది అందరి ప్రశ్న. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికే అలా పెట్టాం. ఈతరం కథతో రూపొందుతోంది. ఇది ఒక మ్యారేజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం. బుధవారం విడుదల చేస్తున్న ఈ సినిమాలోని తొలిగీతాన్ని కశ్మీరులో చిత్రీకరించాం. చాలా అందంగా వచ్చింది. ఇందులో మొత్తం 7 పాటలుంటాయి. చంద్రబోస్ సాహిత్యం అందించారు. కీరవాణి, నా కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమే. మేం ఇద్దరం కలసి రక్తి పాటలు చేసినా... భక్తి పాటలు వినిపించినా... ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఈ చిత్రంలోని పాటలకు మంచి ప్రశంసలు అందుతాయని ఆశిస్తున్నా.
ఆ ఆలోచనలూ ఉన్నాయి...
సినిమాలకు దర్శకత్వం చేశాను. నిర్మించాను. అలాగే టీవీలో సీరియళ్లకు దర్శకత్వ పర్యవేక్షణ చేశా. నిర్మించా. రేపటి తరం మాధ్యమం అయిన ఓటీటీపై అడుగుపెట్టాల్సి ఉంది. ఆ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు చెబుతా.
అలా కుదిరింది
పెళ్లిసందడికి కొనసాగింపు చిత్రం తీస్తే ఎలాంటిది తీయాలి...? అని ఆలోచిస్తున్న తరుణంలో నా దగ్గర 10ఏళ్లుగా రచయితగా పనిచేస్తున్న గౌరి రోనంకి ఒక ఐడియా చెప్పారు. దాన్ని డెవెలప్ చేశాం. ఆమె దర్శకత్వంలోనే ‘పెళ్లిసంద...D’ తెరకెక్కుతోంది. నేను స్క్రీన్ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నా. దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాం. మరో రెండు, మూడు రోజులు షూటింగ్ చేస్తే మొత్తం అయిపోతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. రోషన్ చాలా బాగా చేశాడు. శ్రీలీల తెలుగమ్మాయే. వైద్యవిద్య అభ్యసిస్తోంది. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. వారి జంటను చూసి ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తారు.
మళ్లీ థియేటర్లలో ఆ సందడి
కాస్త జాగ్రత్తగా ఉంటూ... ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే.. కచ్చితంగా ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి అందరం బయటపడతాం. త్వరలోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ప్రేక్షకులకు ధైర్యం వస్తుంది. థియేటర్లు మళ్లీ అభిమానుల సందడితో కళకళలాడతాయి. మా ‘పెళ్లిసంద..D’ చిత్రం ఆ సందడిని రెట్టింపు చేసేలా ఉంటుంది.
ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు కలిసి.. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘పెళ్లిసంద..D’ని నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ సాహిత్యమందించారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా