K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!
తెలుగు సాహిత్య కళలను తన కథలుగా మలచుకొని.. అద్భుతమైన సినిమాలు తీసిన గొప్ప దర్శకుడు కె. విశ్వనాథ్ (K.Viswanath). ఆయన గతంలో పంచుకున్న సినిమా విశేషాలు.
తెలుగు సినిమాను ఒక స్థాయిలో నిలిపారు కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K.Viswanath). ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.(K.Viswanath is no more). ఆయన గతంలో ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో తన మనసులోని పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.
గుంటూరు జిల్లా కదా మీది.. మీ బాల్యం ఎలా గడిచింది?
విశ్వనాథ్: అవును. నేను ఫస్ట్ క్లాస్ మా ఊళ్లో చదివాను. మొదటి తరగతి నుంచి మూడో తరగతికి ప్రమోట్ చేశారు. అప్పట్లో మాస్క్ పెట్టుకున్న వాళ్లని చూసినా నాకు భయం వేసేది. ఒకసారి సంతలో దొరికే మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. దెబ్బకు జ్వరం వచ్చింది. మా నాన్న నాకు సైకిల్ కొనిచ్చారు. దాని మీద తిరగడం అంటే ఇప్పుడు రోల్ రైడ్పై తిరిగినట్టే. ఇవన్నీ చిన్న విషయాలే.. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి గుర్తులు.. నాకు పావురాలంటే చాలా ఇష్టం. వాటికోసం వెళ్లి మా నాన్నకు అబద్ధం చెప్పి తిట్లు తిన్న సందర్భాలెన్నో.
కళాశాల చదువు ఎక్కడ సాగింది?
విశ్వనాథ్: గుంటూరులోని హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. డిగ్రీ అవ్వగానే ఏం చేయాలని ఆలోచిస్తుంటే మాకు తెలిసిన వ్యక్తి అప్పుడే వాహిని స్టూడియో కొత్తగా ప్రారంభించారు. అందులో యువకులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. నన్ను పంపమని మా నాన్నను అడిగారు. మా నాన్న అంగీకరించారు. నేను జాయిన్ అయ్యాను.
దర్శకత్వం మీద మమకారం ఎప్పుడు పెంచుకున్నారు?
విశ్వనాథ్: నేను పెంచుకోలేదండీ. అన్నీ వాటంతట అవే జరిగాయి. నా జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదు. నేను సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశాను. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు వాళ్ల కంపెనీకి రమ్మని అడిగారు. వెళ్లలా వద్దా అని సందేహించా. చక్రపాణి గారు మాత్రం వెళ్లమని చెప్పారు. ‘దర్శకత్వం అంటే కెమెరా ఎక్కడ పెట్టాలి అనేది కాదు.. కథను అరటిపండు ఒలిచి అందించినంత సులువుగా చెప్పాలి’ అన్నారు. కె.వి రెడ్డి సినిమా చూడు.. లైట్లు మార్చినట్టు ఉంటుందన్నారు (నవ్వుతూ).
‘తేనెమనసులు’ సినిమాకు అంతా మీరే చేశారటా? తొలి సినిమా చేసేటప్పుడు ఎలా అనిపించింది?
విశ్వనాథ్: మొత్తం అంటే మొత్తం కాదు. కానీ, మొత్తం(నవ్వుతూ) ఆ సినిమా కోసం అందరం కలిసి పనిచేశాం. అందులో ఎక్కువ బాధ్యత నేను తీసుకున్నాను. మొదటి సినిమా చేసేటప్పుడు నాకేం కొత్తగా అనిపించలేదు. ‘మూగమనసులు’ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పని చేశాను. అప్పటికే అనుభవం ఉండటంతో.. అదేం కొత్తగా అనిపించలేదు. అక్కినేని నాగేశ్వరరావుకి, మధుసూదనరావుకూ దేవుడు అంటే నమ్మకం లేదు. నేను మాత్రం నమ్ముతాను. ఫస్ట్ షాట్ ఎలా తీయాలో అర్థం కాలేదు. దేవుడు మీద తీస్తే కుదరదు. నాకు బాగా గుర్తు.. అద్దంతో మొదలుపెట్టాను. అద్దం లక్ష్మీ దేవీతో సమానం కదా. అందులో తల దువ్వుకుంటున్నట్లు సీన్ చేశాను. ‘శ్రీనివాస.. శ్రీనివాస’ అని అల్లు రామలింగయ్య పిలిచేలా పెట్టాను. దేవుళ్ల పేర్లు కలిసి వస్తాయని అలా చేశాను.
బయటి కథలు ఎందుకు చేయరు అని అడిగేవాళ్లు ఉన్నారు. వారికి మీరిచ్చే సమాధానం?
విశ్వనాథ్: ఇదంతా భగవంతుడి కృప. నేను నిర్మాతకు కథలు చెప్తాను. అందులో వారికి ఏ కథకు నేను సెట్ అవుతానో వారినే చెప్పమని అడుగుతాను. కథ ఓకే అయితే మిగతా విషయాలు మాట్లాడుకునే వాళ్లం. బి.వి.ఎస్ రాజు.. నా కథలను ఉద్దేశిస్తూ మీ పాముల పుట్టలో నుంచి ఓ పాము బయటికి తీయండి అనేవారు. (నవ్వుతూ)
రామారావుతో తక్కువ సినిమాలు చేశారు? కారణం?
విశ్వనాథ్: నాలుగు చేశాను. మొదట్లో నాగేశ్వరరావు పార్టీ అని నాపై ముద్ర పడింది. రామారావుతో చేయడానికి కొందరు నిర్మాతలు కొన్ని సలహాలిచ్చారు. అవేంటంటే రామారావు దగ్గర నాగేశ్వరరావు పేరు తీయకు అని చెప్పారు. నాకు రామారావు ఎవరితో ఎలా ఉండేవారో తెలియదు. నాతో చాలా బాగా ఉండేవారు. నేను ఆయన్ని బ్రదర్ అనే వాడిని. నాతో అందరూ బాగుండే వాళ్లు. చిరంజీవి, మమ్మూటి అందరూ గురు శిష్య బంధంతో ఉండేవాళ్లు.
శంకరాభరణం గురించి చాలా సార్లు చెప్పారు. మరోసారి చెప్పండి?
విశ్వనాథ్: సినిమా తీసిన తర్వాత మొదటి ఆరేడు రోజులు వెనకబడినట్లు అనిపించింది. సినిమా తీసేంత వరకే ఆలోచిస్తాను. తీశాక ఎలా పోతుందని ఆలోచించే వాడిని కాదు. నా సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఒకసారి ‘శంకరాభరణం ఎన్నిసార్లు చూశావు’ అని ట్యాక్సీ డ్రైవర్ను అడిగాను. ‘ఐదారు సార్లు చూశాను’ అన్నాడు.. ఏం ఉందయ్యా అంటే ఏమో తెలీదు సర్. ఆ థియేటర్లో కూర్చుంటే గుడిలో కూర్చున్నట్టు ఉంటుందన్నారు. ఆ మాట కన్నా ఇంకేం ఉంటుంది. ‘సిరివెన్నెల’ తీసేటప్పుడు మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. నేను తీసిన సినిమాల్లో అదే కష్టమైందనుకోవచ్చు. అది సీతారామశాస్త్రికి ఇంటి పేరులా మారింది. పాటలు రాసిన కవులందరికీ రుణపడి ఉన్నాను. ఆత్రేయ గారు నా తొలి సినిమాకు ఒక పాట రాశారు.
పాటలకు పల్లవి రాసేవారుట? పౌరాణిక సినిమాలు తీయాలనే ఆలోచన ఎందుకు చెయ్యలేదు?
విశ్వనాథ్: వాటిని అబద్ధ పల్లవులు అంటాను నేను. కథ రాస్తూ ఓ లైన్ రాసేవాడ్ని అది బాగుందో లేదో కూడా తెలీదు. పౌరాణిక సినిమాలు తీయాలంటే కథలు తెలియాలి కదండీ.. తిక్కన ఎవరో తెలియకుండా ఆయన రాసిన వాటిని ఎలా తీస్తాం చెప్పండి. నాకు బాపు గారు అంటే చాలా ఇష్టం. వారితో పని చేయాలని అనుకునే వాడిని.
మీ నిర్మాతలు ఎప్పుడైనా కథ మార్చాలని సూచించారా?
విశ్వనాథ్: లేదండీ. ఎవరూ చెప్పలేదు. కానీ ‘మాంగల్యానికి మరో ముడి’ అనే సినిమా తీసినప్పుడు ఇబ్బంది వచ్చింది. కథ మార్చి చూపించాలన్నారు. అలానే చేశా. నాకు ఈగో కాదు ముఖ్యం.. నీకు నాలుగు డబ్బులు వస్తే నాకు అంతకంటే ఏం కావాలన్నాను నిర్మాతతో.
నటుల దగ్గర నుంచి ఇలా చేస్తే బాగుంటుందీ అనే పరిస్థితులు ఉన్నాయా?
విశ్వనాథ్: లేదండీ.. రాలేదు. నాకో చెడ్డ పేరు కూడా ఉంది. నేను చెప్పిందే చెయ్యాలంటాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఓ కథ అనుకున్నాక అది పేపర్ మీద రాస్తే కాదు.. చేసి చూపిస్తేనే బాగా వస్తుందని నమ్ముతాను. శంకరాభరణం సినిమా కోసం అక్కినేని నాగేశ్వరావు, శివాజీ గణేశన్ అని చాలా పేర్లు అనుకున్నా. చివరకు ఏ ఇమేజ్లేని వారిని పెట్టాలని నిర్ణయించుకున్నాను. హిందీలో 10 సినిమాలు తీశానంతే. నాకు స్ఫూర్తి ఆ పరమేశ్వరుడే. నా సినిమాలోని పాటలు చూసి ముఖ్యమంత్రి కూడా స్వయంగా వచ్చి కలిసిన సందర్భాలున్నాయి.
నటుడిగా మీ అనుభవాలు ఏంటి?
విశ్వనాథ్: ‘శుభసంకల్పం’ సినిమాకు బాలసుబ్రహ్మణ్యం, కమల్హాసన్ నిర్మాతలు. ఆ సినిమాలో పాత్ర కోసం ఎవరి పేరు చెప్పినా వద్దు అనేవారు. ఒకరోజు సడెన్గా ఆ పాత్ర నువ్వే చేస్తున్నావన్నారు. అన్ని తెలుసు కాబట్టి ఆ పాత్రలో నటించడం నీకు కష్టం కాదన్నారు. నేను అంగీకరించి నటించాను. మంచి ఆదరణ లభించింది. బాలసుబ్రహ్మణ్యం, చంద్రమోహన్ ఇద్దరూ నాకు బంధువులు.
సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందేవి కదా.. ఆర్థికంగా కూడా లాభాలు వచ్చేవా?
విశ్వనాథ్: నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. నా వల్ల ఎంతోమంది నిర్మాతలు కోటీశ్వరులయ్యారు. కొందరు నాకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. అలా ఎగొట్టినవి చాలానే ఉన్నాయి. అయినా, నేనెప్పుడు ఎవరినీ ఏమీ అనలేదు. నా వల్ల ఒకరు బాగుంటే నాకు సంతోషమే. సినిమాల విషయంలో నేను బస్సు డ్రెవర్ని.. నా ప్రేక్షకులను అందులో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లాలి అదే నా లక్ష్యం. ‘శంకరాభరణం’ సినిమా తమిళ హక్కులు రూ.50వేలు పెట్టి కొనడానికి చాలామంది భయపడ్డారు. చివరకు మనోరమ కొన్నారు. ఆవిడకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి.
పుట్టపర్తిలో జరిగిన సంఘటన చెప్పండి?
విశ్వనాథ్: నాకు ‘కళాతపస్వి’ అని బిరుదు ఇచ్చారు. ఆ పదం వినగానే భయం వేసింది. వేదికపైకి వెళ్లి తపస్వి అనే పదానికి నేను సరికాదు. నాకూడా చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పాను. వెంటనే వేదికపై ఉన్న పెద్దాయన మైకు తీసుకుని తపస్వి అంటే తపస్సులు చేసే వాళ్లు మాత్రమే కాదు. చేసే పనిపై తపన ఉన్నవాళ్లు అని చెప్పారు.
మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎలా ఉండేది?
విశ్వనాథ్: ‘శంకరాభరణం’ సినిమాను చాలా మంది ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. నాకు తెలిసినంత వరకు ఒకాయన 96సార్లు చూశాడట. గొప్ప ప్రశంస ఏంటంటే.. నేను అమెరికా వెళ్లినప్పుడు ఒకావిడ కుటుంబంతో నా దగ్గరకు వచ్చి ‘మేము 30 సంవత్సరాలుగా ఇక్కడ మనసుతో బతుకుతున్నామంటే మీ సినిమాలే కారణం’ అని చెప్పింది. దానికి మించిన ప్రశంస ఏముంటుంది. నాకు ఏ ఆలోచన వచ్చినా.. ఏది చేసినా.. అన్నిటికీ స్ఫూర్తి భగవంతుడే.
నటీనటులను డీ గ్లామరైజ్ చెయ్యాలంటే భయపడ్డారా?
విశ్వనాథ్: లేదు. శోభన్బాబు ఎంతటి అందగాడో అందరికీ తెలుసు. ఆయన్ని ‘చెల్లెలి కాపురం’లో బూట్పాలిష్ అంత నల్లగా చూపించాం. దానికి శోభన్బాబు అంగీకరించాడంటే అదంతా ఆయన గొప్పతనం. అలాగే చిరంజీవి, కమల్హాసన్, విజయశాంతి అందరూ అటువంటి పాత్రలు చేశారు. అదంతా వాళ్ల గొప్పతనం.
మీరు అందుకున్న పురస్కారాల్లో మీ మనసుకు హత్తుకున్నది ఏది?
విశ్వనాథ్: నాకు ప్రజల స్పందనే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్లు వచ్చి నా సినిమాల గురించి చెబుతుంటే ఒళ్లు పులకరిస్తుంది. నటీనటులే కాదు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులు కూడా నా సినిమాల్లో నటించాలని కోరుకునేవారు. ఇలాంటివి వింటుంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది. వాళ్ల మాటలు అభిమానంతో మనసులో నుంచి వస్తాయి.
ఏ దర్శకుడినైనా చూసినప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలకు వారసులు ఉన్నారని అనుకొన్నారా?
విశ్వనాథ్: ఒక దర్శకుడు మరో డైరెక్టర్లా ఎప్పుడూ సినిమాలు తీయలేరు. ఎవరి శైలి వారిదే. సినీ రంగంలో జాక్పాట్ కొట్టినట్లు ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. ఇందులోనూ పైకి రానీకుండా చెయ్యడానికి చాలా రాజకీయాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..