ఆ ఆవిష్కరణ ముందుగా చూసింది కిచ్లూనే..

నటిగా తన జీవితంలో ఎంతో కీలకంగా చెప్పుకునే ఓ రోజులో గౌతమ్‌ కిచ్లూ కూడా భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందని కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. ఫిబ్రవరి 5 ఆమె జీవితంలో ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది ఇదే....

Published : 05 Feb 2021 17:40 IST

బిజీగా ఉన్నా ఆయన నాతోనే ఉన్నారు

హైదరాబాద్‌: తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాదైన సందర్భంగా తాజాగా నటి కాజల్‌ తన ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేశారు. ఇందులో మైనపు విగ్రహంతో పాటు కాజల్, ఆమె భర్త కిచ్లూ కూడా ఉన్నారు.

‘సింగపూర్‌లో నా మైనపు విగ్రహం ప్రారంభించి సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ ప్రపంచం ఎదుట ఆవిష్కరించడానికి ముందే కిచ్లూ దానిని చూశారు. వృత్తిపరంగా తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి నాలుగో తేదీన సింగపూర్‌కు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి జర్మనీ వెళ్లారు. అతని చూపులు నాపైనే ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది’ అని కాజల్‌ ఆనాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.

ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న కాజల్‌-గౌతమ్‌ కిచ్లూ గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అక్టోబర్‌ 30న ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో వేడుకగా జరిగింది. ఇటీవల ఈ జంట ‘కిచ్డ్‌’ అనే పేరుతో కుషన్స్‌ బిజినెస్‌ ప్రారంభించింది. మరోవైపు కాజల్‌ నటిగా సినిమా షూటింగ్స్‌లతో బిజీగా ఉంటున్నారు.

ఇవీ చదవండి!

నీ పవర్‌ ఇప్పుడు వాడు: మంచు లక్ష్మి

అందుకే ఆమెను బి-గ్రేడ్‌ అనేది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని