వాలంటైన్స్‌డే: కాజల్‌ కపుల్‌ @ శాంతి మెస్‌

ఎన్నో చిత్రాల్లో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కాజల్‌ అగర్వాల్‌. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్‌ కిచ్లూను ఇటీవలే

Published : 15 Feb 2021 17:45 IST

పొల్లాచ్చి: ఎన్నో చిత్రాల్లో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కాజల్‌ అగర్వాల్‌. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్‌ కిచ్లూను ఇటీవలే వివాహం చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది ఈ జంట. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నూతన దంపతులు ఏ కొత్త ప్రదేశానికో వెళ్లి ఉంటారని నెటిజన్లు అనుకున్నారు. అయితే వీరు పొల్లాచ్చిలోని ‘శాంతి మెస్‌’కు‌ అతిథిలుగా వెళ్లటం విశేషం. వారితో దిగిన ఫొటోలను కాజల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

‘‘నాకెంతో ఇష్టమైన ‘శాంతి మెస్‌’ పొల్లాచ్చిలో ఉంది. ఆ హోటల్‌ యజమానులైన శాంతి అక్క, బాలాకుమార్‌ అన్న మాకు ఎంతో ప్రేమగా భోజనం వడ్డించారు. వారు ప్రేమతో చేసే సర్వీసు వల్లే ఈ మెస్‌ గత 27 సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. నాకు ఈ మెస్‌తో తొమ్మిదేళ్ల అనుబంధం ఉంది’’ అని సోషల్‌మీడియాలో  రాసుకొచ్చింది. అలాగే తన భర్తతో కలిసున్న పెళ్లినాటి ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘మారుతున్న తేదీలు ఎప్పుడూ నీ మీద నాకున్న ప్రేమను తగ్గించలేవు. మనకు రోజూ ప్రేమికుల దినోత్సవమే’ అంటూ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం కాజల్‌ చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంతో పాటు, మంచు మనోజ్‌ ‘మోసగాళ్లు’లోనూ నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు