Kalyanram: ఆఖరి రక్తపుబొట్టు వరకూ పనిచేస్తా: కల్యాణ్ రామ్
విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి పని చేస్తానని నటుడు కల్యాణ్ రామ్ (KalyanRam) అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘బింబిసార....
స్టేజ్పై నటుడి ఎమోషన్, కన్నీరుపెట్టుకున్న చోటా కె.నాయుడు
హైదరాబాద్: విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి పని చేస్తానని నటుడు కల్యాణ్ రామ్ (KalyanRam) అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘బింబిసార’ (Bimbisara) ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారందరికీ థ్యాంక్యూ చెబుతూ చిత్రబృందం ఓ ప్రెస్మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా కల్యాణ్రామ్ తమ చిత్రానికి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
‘‘2020 మార్చి 10న ‘బింబిసార’ మొదలుపెట్టాం. సినిమా ప్రారంభించిన ఐదో రోజే లాక్డౌన్ అన్నారు. మూడున్నర నెలల తర్వాత షూట్ తిరిగి ప్రారంభించాం. సెకండ్వేవ్.. మళ్లీ లాక్డౌన్ అన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుపడ్డాను. ఏదో ఒక రకంగా షూట్ పూర్తి చేసి సినిమా విడుదల చేద్దాం అనుకునే సమయానికి ప్రేక్షకులు అస్సలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నా. పైకి కంగారుగా అనిపించినప్పటికీ.. మంచి కంటెంట్తో సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మా. అదే ఇప్పుడు రుజువైంది. మా సినిమాకు మంచి విజయాన్ని అందించిన నందమూరి వీరాభిమానులు, సినీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. చోటా కె.నాయుడు నన్ను ఎంతో భరించి వర్క్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎంతోమంది నటీనటుల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఆ క్షణం మళ్లీ పుట్టాననిపించింది. నాకు పునర్జన్మనిచ్చిన చిత్రం ‘బింబిసార’. ఇక, నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి వర్క్ చేస్తా’’ అని కల్యాణ్ రామ్ అన్నారు.
అనంతరం ‘బింబిసార’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్రాజు మాట్లాడుతూ.. ‘‘జూన్ 3న తెలుగు చిత్రపరిశ్రమలో రెండు సినిమాలు విడుదలై సూపర్హిట్స్ అందుకున్నాయి. అవే ‘విక్రమ్’, ‘మేజర్’. ఆ తర్వాత సుమారు రెండు నెలలు ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరిశ్రమ ఏమైపోతుంది? ఏం చేయాలి? ఎలా ప్రేక్షకుల్లోకి వెళ్లాలి? అని భవిష్యత్తుపై అందరూ ఆందోళన చెందుతున్న వేళ ‘సీతారామం’, ‘బింబిసార’ విడుదలై మాలో ఊపిరి నింపాయి. సినిమా అంటేనే ఒక కుటుంబం. ఏ సినిమా ఆడినా అందరం సంతోషిస్తాం. వశిష్ఠ ‘దిల్’ సమయం నుంచి తెలుసు. అతడికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. చేజారిపోయాయి. కానీ కుంగిపోలేదు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తన సత్తా చాటుకున్నాడు. ఇండస్ట్రీకి సూపర్హిట్ ఇచ్చాడు. విడుదలకు 15 రోజుల ముందే ఈ సినిమా చూశా. కల్యాణ్రామ్ నటన బాగా నచ్చేసింది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనిపించింది. సినిమా రిలీజ్ అయ్యాక చోటాకు ఫోన్ చేస్తే ఏడ్చేశాడు. ఏమైంది ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావ్ అని అడగ్గా.. ‘‘పదేళ్లైంది నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చి. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నాడు’’ అని దిల్ రాజు చెప్పగానే స్టేజ్పై ఉన్న చోటా కె.నాయుడు మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దిల్రాజు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్తో విజయ్.. టైటిల్స్తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు
-
ఇకనైనా బౌండరీ లైన్ల పరిధిని పెంచండి..: సునీల్ గావస్కర్
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
-
సామ్ కరన్కు 50 శాతం.. డుప్లెసిస్కు రూ. 12 లక్షల ఫైన్