Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా తెరకెక్కిన సినిమా ‘అమిగోస్’ (Amigos). ఆయన త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు కల్యాణ్ రామ్ మీడియాతో పంచుకున్నారు.
రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా తెరకెక్కిన సినిమా ‘అమిగోస్’ (Amigos). ఆషికా రంగనాథ్ కథానాయిక. కల్యాణ్రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ప్రచార చిత్రం నుంచే ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘అమిగోస్’ (Amigos)కు సంబంధించిన విశేషాలు కల్యాణ్ రామ్ మీడియాతో పంచుకున్నారు.
‘బింబిసార’ (Bimbisara) సక్సెస్ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.
కల్యాణ్ రామ్: ‘బింబిసార’ సక్సెస్ జోష్తోనే ‘అమిగోస్’ (Amigos) తీశాను. ఏదైనా సినిమా హిట్ అయితే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. దానితోపాటు బాధ్యత కూడా రెట్టింపవుతుంది. కొత్తగా ప్రయత్నిద్దాం అని అనుకుంటాం. నేను ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ ఈ మూడు కథలు 2020లోనే ఓకే చేశాను. అమిగోస్ కథ వినగానే కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చేశాను. సాధారణంగా సినిమాలో ట్రిపుల్ రోల్ అంటే కనీసం ఇద్దరు హీరోయిన్లైనా ఉంటారు. కానీ ‘అమిగోస్’ పూర్తి విభిన్నమైన సినిమా. ఇందులో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుంది. విలన్ కూడా ఉండడు. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు. వాళ్లకేం కావాలి.. ఇలా సినిమా అంతా ఆసక్తిగా ఉంటుంది.
‘అమిగోస్’ అనే టైటిల్నే ఎందుకు పెట్టారు?
కల్యాణ్ రామ్: ఈ సినిమాలో ముగ్గురి పాత్రలు కీలకమైనవే. అలాంటప్పుడు ఎవరో ఒకరి పేరు సినిమాకు పెట్టడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్షిప్నకు సంబంధించిన టైటిల్ పెట్టాలని నిర్ణయించాం. అలా అని రోటీన్గా కాకుండా కొత్తగా ఉండాలనుకున్నాం. సోషల్మీడియాలో అమిగో అనే హ్యాష్ట్యాగ్ చూశాను. నచ్చింది. ఈ సినిమాకు కూడా సరిపోతుందనిపించింది. దాని అర్థం ఎవరికీ తెలియదు అని ఎందుకు అనుకోవాలి. ‘కాంతార’ సినిమా వచ్చేవరకు ఆ పేరు అర్థం ఎవరికీ తెలీదు కదా!
‘అమిగోస్’ ఎలాంటి సినిమా.. కమర్షియల్ సినిమానా లేక ప్రయోగాత్మకమైనదా?
కల్యాణ్ రామ్: నేను తీసిన సినిమాల్లో కమర్షియల్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ‘బింబిసార’ కూడా పాత కథే. కానీ ఆ కథను చూపించే విధానంపై సినిమా ఆధారపడి ఉంటుంది. ‘అమిగోస్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటుంది. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్రామ్నే చూస్తారు. అంత ప్రాధాన్యం ఉంటుంది. మా కుటుంబంలో నుంచే త్రిపాత్రాభినయం సినిమాలు ఎక్కువగా వచ్చాయని అనుకుంటున్నారు. కానీ గతంలో చాలా మంది హీరోలు ట్రిపుల్ రోల్ సినిమాలు చేశారు. మా కుటుంబంలో హీరోలకు ఇలాంటి కథలు రావడం మా అదృష్టం.
‘బింబిసార’ నుంచి మీ కథల ఎంపికలో మార్పు వచ్చిందా?
కల్యాణ్ రామ్: అసలు ఆ సినిమా తర్వాత నేను ఏ కథనూ ఓకే చెయ్యలేదు. ఇవన్నీ దానికి ముందు రెడీ చేసుకున్నవే. నేను ‘బింబిసార’ ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఏ సినిమా అంగీకరించినా.. ఆ పాత్ర గతంలో ఏ హీరో చెయ్యనిదై ఉండాలనుకుంటా. ఈ ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా చూస్తాను. అమిగోస్లో విలన్లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. కొవిడ్ టైంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని ఆలోచించాను. నేను చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకున్నాను. అమిగోస్ మేకింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించింది.
బాలకృష్ణ సినిమాలోని పాటను రీమేక్ చెయ్యాలని ఎందుకు అనిపించింది?
కల్యాణ్ రామ్: ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా కొత్తగా తీశాం. సెకండ్ హాఫ్లో కథ ఆసక్తిగా సాగుతున్నప్పుడు పాట వస్తే ప్రేక్షకులు నిరాశపడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్నాం. అందుకే రీమేక్ సాంగ్ పెట్టాం. ఈ పాటను స్క్రీన్పై చూసినప్పుడు అందరూ షాక్ అవుతారు.
ఆషికా రంగనాథ్తో చేయడం ఎలా అనిపించింది. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన మీ పాత్ర ఏది?
కల్యాణ్ రామ్: ఆషికాను హీరోయిన్గా టీం అంతా కలిసి ఓకే చేశాం. ఆమె మంచి డ్యాన్సర్. కన్నడ, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఈ సినిమాలో నేను చేసిన మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ మూడు పాత్రలు నాకు నచ్చాయి. సిద్ధార్థ్ చాలా యాక్టివ్గా ఉంటాడు. మంజునాథ్ చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్. మైఖేల్ పాత్ర పూర్తిగా భిన్నమైంది. గ్యాంగ్స్టర్ లాంటి పాత్ర. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చెయ్యాలని ఎందుకు అనిపించలేదు?
కల్యాణ్ రామ్: ఈ మాట మీరు మైత్రీ మూవీస్ వారిని అడగాలి(నవ్వుతూ). సినిమా చేస్తున్నంతసేపు పాత్రలు, సన్నివేశాల గురించే ఆలోచించాం. మార్కెటింగ్ విషయాల గురించి ఆలోచించలేదు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా లేదు.
ఒకే పోలికలతో ఉండే మనుషులను మీరు ఎప్పుడైనా చూశారా?
కల్యాణ్ రామ్: మనుషులను పోలిన మనుషులు ఉంటారని ఇటీవల వార్తల్లో చూశాను. చాలా ఆనందంగా అనిపించింది. మేము చేస్తున్న కథ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందనిపించింది. ‘జనతా గ్యారేజ్’ సినిమా అప్పుడు మైత్రీ మూవీస్ వారితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మేమంతా ఓ కుటుంబంలా కలిసిపోయాం.
‘బింబిసార2’, ‘డెవిల్’ అప్డేట్స్ ఏమైనా చెబుతారా?
కల్యాణ్ రామ్: ‘డెవిల్’ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయింది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో మూడు నెలల్లో కంప్లీట్ అవుతుందనుకుంటున్నాం. ‘బింబిసార2’ ఈ ఏడాది చివరలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్