Kangana Ranuat: వ్యాఖ్యాతగా కంగన!

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మించనున్న ఓ రియాల్టీ షో కోసం  కంగనాను సంప్రదించారట. ‘‘చాలా  సాహసంతో కూడిన రియాల్టీ షో ఇది.

Updated : 02 Feb 2022 06:54 IST

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మించనున్న ఓ రియాల్టీ షో కోసం  కంగనాను సంప్రదించారట. ‘‘చాలా  సాహసంతో కూడిన రియాల్టీ షో ఇది. అందుకే దీని కోసం తన స్నేహితురాలు  కంగనాను ఎంచుకున్నారు ఏక్తా. ఈ షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇది ఓటీటీ వేదికల్లో ప్రసారం కానుంది’’అని ఏక్తా సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. ఇప్పటివరకూ నాయికగా సత్తా చాటుతున్న కంగన డిజిటల్‌ వేదికపై ఎలాంటి సందడి చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని