Kangana Ranaut: ఇండస్ట్రీలో నేను మాత్రమే వాళ్లతో సమానంగా పారితోషికం తీసుకుంటున్నా: కంగనా రనౌత్‌

ఇండస్ట్రీలో పారితోషికాల్లో వ్యత్యాసం గురించి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మాట్లాడింది. కొందరు నటీమణులు ఫ్రీగా నటించడానికి కూడా సిద్ధంగా ఉంటారని తెలిపింది.

Published : 31 May 2023 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో నటీనటుల పారితోషికాల్లో వ్యత్యాసం గురించి చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపింది. తాజాగా దీనిపై కంగనా రనౌత్‌ స్పందిస్తూ.. పరిశ్రమలోని పరిస్థితుల గురించి ప్రియాంక ధైర్యంగా చెప్పిందన్నారు.

ప్రియాంక చోప్రా వీడియో షేర్‌ చేసిన ఆమె (Kangana Ranaut) తాను మాత్రమే ఇండస్ట్రీలో పురుషులతో సమానంగా పారితోషికం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘పరిశ్రమలో పారితోషికం గురించి మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే. దాని గురించి మాట్లాడినందుకు నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నా పాత్రలను వేరే వాళ్లతో ఉచితంగా చేయించారు. అలా వేరే వాళ్ల పాత్రల్లో నటించడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇండస్ట్రీలో నేను మాత్రమే హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాను. మిగతా వాళ్లు ఎందుకు తీసుకోవట్లేదో వాళ్లని వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పింది. అలాగే కరణ్‌ జోహార్‌ కారణంగానే ప్రియాంక బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌కు వెళ్లిందని కంగనా తెలిపింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగనా చంద్రముఖి సినిమా సీక్వెల్ ‌‘చంద్రముఖి 2’లో (Chandramukhi 2) రాజనర్తకి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.  దీనితో పాటు ‘ఎమర్జెన్సీ’(Emergency)లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘ఇందిరా గాంధీ’ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని