Kantara: కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది

రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ కథానాయిక. కిషోర్‌ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 12 Oct 2022 07:31 IST

రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’ (Kantara). హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయిక. కిషోర్‌ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఇది అక్టోబరు 15న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ.. ‘‘అడవి నేపథ్యంలో సాగే ఓ మిస్టరీ కథతో రూపొందిన చిత్రమిది. వ్యవసాయ భూమితో ముడిపడి ఉండే భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’’ అన్నారు. ‘‘విభిన్నమైన సినిమా కావాలనుకునే వారికి ‘కాంతార’ కచ్చితంగా నచ్చుతుంది. అంతర్లీనంగా విష్ణు తత్వాన్ని పెట్టుకుని ఈ కథ చెప్పడం జరిగింది. ఈ చిత్రంలో రిషబ్‌ అద్భుతంగా నటించడమే కాకుండా ఎంతో చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఈ కార్యక్రమంలో సప్తమి, రాంబాబు గోసాల పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని