Karan Johar: కరణ్‌ జోహార్‌ కీలక ప్రకటన

బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్ కీలక ప్రకటన చేశారు. వ్యాఖ్యాతగా ఆయన్ని ప్రేక్షకులకు ఎంతగానో చేరువ చేసిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో ముగిసిందని అన్నారు. ప్రముఖ సెలబ్రిటీ చాట్‌ షోగా ప్రాముఖ్యత....

Published : 04 May 2022 15:51 IST

ముంబయి: బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్ కీలక ప్రకటన చేశారు. వ్యాఖ్యాతగా ఆయన్ని ప్రేక్షకులకు ఎంతగానో చేరువ చేసిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో ముగిసిందని తెలిపారు. ప్రముఖ సెలబ్రిటీ చాట్‌ షోగా పేరు తెచ్చుకున్న ఈ షోలో.. బీటౌన్‌ స్టార్‌ సెలబ్రిటీలను కరణ్‌ ఇంటర్వ్యూలు చేశారు. దాదాపు 6 సీజన్లపాటు ఈ షో విజయవంతంగా కొనసాగింది. కాగా, గత కొన్నిరోజుల నుంచి ‘కాఫీ విత్‌ కరణ్‌ - సీజన్‌ 7’ రానుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వార్తలపై తాజాగా కరణ్‌ స్పందించారు. ‘‘గడిచిన ఆరు సీజన్ల నుంచి ‘కాఫీ విత్‌ కరణ్‌’ నా, మీ జీవితాల్లో భాగమైపోయింది. ఈ షో వేదికగా మేము ఒక సరికొత్త ప్రభావం కలిగించిందనందుకు ఆనందంగా ఉంది. అలాంటి ‘కాఫీ విత్‌ కరణ్‌’ తిరిగి ప్రసారం కావడం లేదు. బరువైన హృదయంతో ఈ మాట చెబుతున్నా’’ అని కరణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని