Bollywood: మళ్లీ రణ్‌వీర్‌-అలియా జోడీ సందడి

2022లో రాకీ ఔర్‌ రాణికీ ప్రేమ్‌ కహాని

Updated : 06 Jul 2021 14:18 IST

ముంబయి: ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రం వచ్చి ఐదేళ్లు పూర్తవుతుంది. అప్పటి నుంచి మెగా ఫోన్‌ పట్టుకోని కరణ్‌జోహార్‌ మళ్లీ దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు.  ‘రాకీ ఔర్‌ రాణికీ ప్రేమ్‌ కహాని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని మంగళవారం ప్రకటించారు. గల్లీబాయ్‌తో అలరించిన జోడీ రణ్‌వీర్ సింగ్‌‌, అలియా భట్ ఇందులో నటించనున్నారు. జులై6న రణ్‌వీర్ 36వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రణ్‌వీర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి కథ ఇషితా మొయిత్రా, శశాంక్ ఖైతాన్ సుమిత్ రాయ్ అందించగా.. హిరో యశ్‌ జోహార్‌, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని