Kantara: కాంతార మూవీ ఎఫెక్ట్‌.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్ణాటకలో 60ఏళ్లు దాటిన  భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Updated : 07 Dec 2022 17:09 IST

బెంగళూరు: భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తోంది ‘కాంతార’. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు, ఆ పాత్రలో ఆయన నటన మెప్పిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60ఏళ్లు దాటిన  భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్వీట్ చేశారు.

‘దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి భాజపా నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్‌ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్లకు కృతజ్ఞతలు’ అని పీసీ మోహన్‌ పేర్కొన్నారు.

బాలీవుడ్‌లో వేగంగా పుంజుకుంటున్న ‘కాంతార’

కన్నడ చిత్రంగా విడుదలై ఇప్పుడు ఇతర భాషల్లోనూ వరుస కలెక్షన్లు రాబడుతోంది ‘కాంతార’. ముఖ్యంగా బాలీవుడ్‌లో కలెక్షన్లలో వేగం పెంచింది. విడుదలైన శుక్రవారం రూ.1.27కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ మూవీ శనివారం రూ.2.75, ఆదివారం 3.50, సోమవారం 1.75, మంగళవారం 1.88కోట్లు, బుధవారం రూ.1.95కోట్లు రాబట్టింది. మొత్తం ఇప్పటివరకూ రూ.13.10కోట్లు వసూలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని