Karthi: ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదు : కార్తి

విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష, కార్తి కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈసినిమా ఇటీవల విడుదలై అంతటా మంచి టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో కార్తి ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. 

Published : 02 Oct 2022 16:04 IST

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకోవడంపై నటుడు కార్తి స్పందించారు. ఇలాంటి చరిత్రాత్మక చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు.

‘‘వందియ‌దేవ‌న్‌గా ఈ ప్రయాణంలో నేను పొందిన అనుభూతిని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. కల్కి కృష్ణమూర్తి రాసిన అద్భుతమైన నవలను  పూర్తిగా అర్థం చేసుకొని.. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి దీన్ని ఒక చిత్రంగా తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నానికి, మునుపెన్నడూ చూడని విజువల్స్‌తో ఈ కథను చిత్రీకరించిన రవివర్మన్‌కు, వీనులవిందైన సంగీతం అందించిన రెహమాన్‌కు, ఆనాటి వైభవాన్ని తన సెట్స్‌తో కళ్లకు కట్టినట్లు చూపించిన తోట తరణికి.. ఇలా కెమెరా వెనుక ఉండి సినిమా కోసం వర్క్‌ చేసిన వారితోపాటు, నా తోటి నటీనటులకూ కృతజ్ఞతలు. అలాగే, ఈ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన నా అభిమానులకు, సినీ ప్రియులకు ధన్యవాదాలు’’ అని కార్తి పేర్కొన్నారు.

చోళ సామ్రాజ్య వైభవాన్ని తెలియజేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకులను అలరించనుంది. విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష, కార్తి కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మొదటి భాగంగా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని