మైనస్‌ డిగ్రీల్లో.. ‘కార్తికేయ 2’ చిత్ర బృందం

మైనస్‌ 6 డిగ్రీ ఉష్ణోగ్రతలు..  అంతటా ప్రతికూల వాతావరణం.. మంచు తుపాను కారణంగా హై అలర్ట్‌.. ఇదీ ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ పరిస్థితి. ఈ మంచు తుపానులో చిక్కుకుంది ‘కార్తికేయ 2’ చిత్ర బృందం.

Updated : 25 Mar 2021 09:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైనస్‌ 6 డిగ్రీ ఉష్ణోగ్రతలు.. అంతటా ప్రతికూల వాతావరణం.. మంచు తుపాను కారణంగా హై అలర్ట్‌.. ఇదీ ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ పరిస్థితి. ఈ మంచు తుపానులో చిక్కుకుంది ‘కార్తికేయ 2’ చిత్ర బృందం. నాయకానాయికలతోపాటు ఇతర తారాగణం హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిస్సు ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌కి హాజరయ్యారు. హిమపాతం కారణంగా ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిపివేశారు. పరిస్థితి చక్కబడ్డాక యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. గతంలో వచ్చన ‘కార్తికేయ’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని