Karthikeya2: ఆద్యంతం ఉత్కంఠగా ‘కార్తికేయ2’.. ట్రైలర్‌ చూశారా?

నిఖిల్‌(Nikhil) కథానాయకుడిగా... చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ2’ (Karthikeya2).

Updated : 06 Aug 2022 19:31 IST

హైదరాబాద్‌: నిఖిల్‌(Nikhil) కథానాయకుడిగా... చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కార్తికేయ2’ (Karthikeya2). అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్‌ను స్టార్‌ హీరో రవితేజ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్తికేయ మొదటి భాగానికి మించి ట్విస్ట్‌లు ఉన్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఆద్యంతం ఉత్కంఠగా అలరించేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ‘నా వరకూ రానంత వరకే సమస్య. నా వరకూ వచ్చాక అది సమాధానం’ అంటూ నిఖిల్‌ చెబుతున్న సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘శ్రీకృష్ణుడి చరిత్రతో ముడిపడిన కథ ఇది. ఆ చరిత్రలోకి డా.కార్తికేయ చేసే ప్రయాణం ఆసక్తికరం. ‘కార్తికేయ’ తర్వాత ఆ కలయికలోనే రూపొందిన ఈ చిత్రం అంచనాల్ని అందుకునేలా ఉంటుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యమేనన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని