కత్రినాకైఫ్కు కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినాకైఫ్కు కరోనా సోకింది. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ కరోనా బారిన పడింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తోన్న ‘రామసేతు’ చిత్ర యూనిట్ సభ్యుల్లో 40మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులు సైతం కరోనా బారినపడ్డారు. కత్రినాకైఫ్ ‘సూర్యవంశీ’ సినిమాలో అక్షయ్తో కలిసి నటించింది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా కత్రినా కైఫ్ బాయ్ఫ్రెండ్గా వార్తల్లో నిలుస్తున్న విక్కీ కౌశల్ కూడా కరోనాకు గురయ్యాడు. కౌశల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాతి రోజే కత్రినా పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే ఐసోలేషన్కు వెళ్లాను. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నా. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల కాలంలో నాతో కలిసిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268