సన్నీలియోనీకి ముందస్తు బెయిల్‌

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చీటింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి సన్నీలియోనీకి కాస్త ఊరట లభించింది. ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కూడా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తాజాగా కేరళ హైకోర్టు తీర్పుని వెలువరించింది. 2019లో...

Published : 10 Feb 2021 14:06 IST

తిరువనంతపురం: ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చీటింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి సన్నీలియోనీకి ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 2019లో ప్రేమికుల దినోత్సవం రోజున తాము ఏర్పాటు చేసిన రెండు ఈవెంట్లలో సన్నీలియోనీ పాల్గొంటానని చెప్పి అప్పట్లో తమ వద్ద నుంచి రూ.29 లక్షలు తీసుకుందని, కానీ ఆమె మాత్రం పాల్గొనలేదని పేర్కొంటూ ఇటీవల ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెను విచారించారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్‌ కోరుతూ సన్నీలియోనీ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

ఇవీ చదవండి

పుష్ప షూట్‌.. నాలుగు గంటలే నిద్ర: రష్మిక

ఈ బతుకు అవసరమా అనిపించింది: శ్రీలక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని