2022లో ఖుషీకపూర్ తెరంగేట్రం!
అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీకపూర్ తెరంగేట్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అవుననే
మంబయి: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీకపూర్ తెరంగేట్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆమెను వెండితెరకు పరిచయం చేయడానికి కరణ్జోహర్ వంటి బడా నిర్మాతలు ఇప్పటికే బోనీకపూర్ను కలిశారని తెలుస్తోంది. అయితే ఆమె సినీరంగ ప్రవేశానికి అంత తొందర పడటం లేదని బోనీకపూర్ అన్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి.
ప్రస్తుతం ఖుషీకపూర్ న్యూయార్క్లోని లీ స్టార్స్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందుతోంది. ఇది 2021 ద్వితీయార్ధంలో పూర్తవుతుందని, ఆ శిక్షణ తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తుందని చెబుతున్నారు. 2022లో ఆమె తెరపై కన్పించనుందని బాలీవుడ్ వర్గాలు వివరించాయి. శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి ‘గుంజన్ సక్సేనా’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఈమె కరణ్జోహార్ తీస్తున్న ‘తాహ్త’, ‘దోస్తానా-2’, ‘గుడ్లక్ జర్నీ’ చిత్రాలతో బిజీగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని